‘ఉయ్యాలా జంపాలా’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన రాజ్ తరుణ్ కొన్నాళ్ల క్రితం ‘సినిమా చూపిస్త మావ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటి రెండు చిత్రాలు కూడా సక్సెస్ అవ్వడంతో రాజ్ తరుణ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగి పోయింది. దాంతో ఈయన నటించిన సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి రెండు సినిమాలకు గ్యాప్ తీసుకున్న ఈయన ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.
సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కిన ‘కుమారి 21ఎఫ్’ చిత్రం ఈనెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ‘కుమారి 21ఎఫ్’ విడుదల అయిన వెంటనే ‘సీతమ్మ అందాలు, రామయ్య సిత్రాలు’ చిత్రంతో రాజ్ తరుణ్ రాబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే నెల రెండవ లేదా మూడవ వారంలో ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్గా అర్తన నటించింది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో రాబోతున్న రాజ్ తరుణ్ సక్సెస్ను కూడా బ్యాక్ టు బ్యాక్ దక్కించుకుంటాడో చూడాలి.