raghuveera reddy says Congress no allaince in andhra pradeshపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిలో హాస్యం పాలు ఎక్కువగానే ఉన్నటుంది. కేంద్రంలోకాని, రాష్ట్రంలో కాని ఒంటరిగా పోటీచేసి గెలిచే సత్తా ఒక్క కాంగ్రెస్ కే ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎవరితో ఎలాంటి పొత్తులు ఉండబోవని ఆయన అంటున్నారు. ఒంటరిగానే పోటీ చేసి గెలుస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందని వైసీపీ అంటోందని, అలాగే పొత్తులు వద్దంటూ టీడీపీలో కొందరు మంత్రులు వ్యాఖ్యానించడం వెనుక ఓటమి భయమే కారణమన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే నిర్ణయం తీసుకోలేదని, విభజనకు అన్ని పార్టీలూ కారణమన్న నిజాన్ని ప్రజలు గ్రహించారన్నారు.

దీనితో కాంగ్రెస్ ఈసారి గెలవడం ఖాయమని ఆయన చెప్పుకొచ్చారు అదే సమయంలో రాహుల్‌గాంధీ దేశ ప్రజలకు ఇస్తున్న భరోసా వల్ల కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమైందన్నారు. ఈసారి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన చెప్పుకొచ్చారు. కర్నూలు నగరంలో సెప్టెంబర్ 18వ తేదీ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కాంగ్రెస్ తరపున సభ పెట్టబోతున్నారు.