Radhe Shyamయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ దర్శకుడు రాధా కృష్ణ కుమార్ తమ సినిమా షూటింగ్ సెప్టెంబర్ రెండవ వారం నుండి తిరిగి ప్రారంభమవుతుందని గత నెలలో ప్రకటించారు. మనం సెప్టెంబర్ చివరి వారంలో ఉన్నాము మరియు ఇప్పటికీ, పునఃప్రారంభం గురించి ఎటువంటి వార్తలు లేవు.

ఈ చిత్రబృందం మొన్న ఆ మధ్య ఇటలీకి వెళ్ళే అవకాశం ఉందని కూడా అన్నారు. అయితే దాని గురించి కూడా ఎటువంటి ప్రకటన లేదు. ఈ తతంగం పట్ల అభిమానులు సంతోషంగా లేరు. రాధే శ్యామ్ తన మొత్తం షూటింగ్ భాగాన్ని జనవరి 2021 లోపు పూర్తి చేయాలి, ఎందుకంటే ప్రభాస్ ఆది పురుష్ అప్పుడు సెట్స్ మీదకు తీసుకునివెళ్ళడానికి ప్రణాళికలు రచిస్తున్నారు.

ఈ సినిమా కాకుండా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్‌కు సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కూడా ఉంది. ఈ రెండు ప్రాజెక్టులు 2021 మొదటి భాగంలో ప్రారంభమవుతాయి. ప్రభాస్ ఈ రెండు చిత్రాలను 2022 లో విడుదల చేయాలని యోచిస్తున్నాడు. కాబట్టి, రాధే శ్యామ్‌ను జనవరి 2021 నాటికి ఎలాగైనా పూర్తి చేయాలి.

రాధే శ్యామ్ పూజా హెగ్డే ఇప్పటికే హైదరాబాద్ వచ్చి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ షూటింగ్ లో బిజీగా ఉంది. రాధే శ్యామ్ ఈ ఏడాది దసరాకు విడుదల కావాల్సింది. అయితే కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. వచ్చే ఏడాది వేసవి స్పెషల్ గా విడుదలయ్యే అవకాశం ఉంది.