Radhe shyam Director Radha krishna interviewమార్చి 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యేందుకు సిద్ధమవుతోన్న “రాధే శ్యామ్” సినిమా ప్రమోషన్స్ ను ఇటీవలే మళ్ళీ ప్రారంభించారు. ‘ఈ రాతలే’ వీడియో సాంగ్ తో ప్రారంభమైన ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు రాధాకృష్ణ మీడియా ప్రశ్నలకు జవాబిచ్చారు. ఈ క్రమంలో పలు ఆసక్తికరమైన జవాబులు లభించాయి.

“రాధే శ్యామ్” సినిమాకు తెలుగులో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తారనే వార్తలు ఇటీవల చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. గతంలో పవన్ ‘జల్సా’కు, ఎన్టీఆర్ ‘బాద్ షా’కు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చిన ఘనత సూపర్ సొంతం కావడంతో, ప్రభాస్ ‘రాధే శ్యామ్’పై గుప్పుమన్న వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. అయితే తాజాగా దర్శకుడి నుండి దీనికి జవాబు లభించింది.

‘రాధే శ్యామ్’ సినిమాకు తెలుగులో వాయిస్ ఓవర్ ఇస్తోంది మహేష్ బాబు కాదని స్పష్టం చేసిన దర్శకుడు రాధాకృష్ణ, ఎవరు ఇస్తున్నారో మాత్రం చెప్పలేదు. విడుదల కాబోతున్న 5 భాషలలో వివిధ వ్యక్తులతో వాయిస్ ఓవర్ ఉంటుందని తెలిపారు. మార్చి 11న విడుదల కాబోయే ఈ సినిమా పబ్లిసిటీ కార్యక్రమాలను మార్చి 1 లేదా 2 నుండి ప్రారంభం అవుతాయని అన్నారు.

ఇప్పటికే విడుదలైన ధియేటిరికల్ ట్రైలర్ అంచనాలను పెంచగా, తాజాగా మరో ట్రైలర్ ను సిద్ధం చేసినట్లుగా రాధాకృష్ణ చెప్పుకొచ్చారు. సంక్రాంతి టార్గెట్ చేసుకుని ముందుగా రిలీజ్ చేసిన ట్రైలర్ సర్వత్రా ఆదరణకు గురి కాగా, అభిమానులను ఉత్సాహపరిచేందుకు సరికొత్తగా మరో ట్రైలర్ ను సిద్ధం చేయడం ఫ్యాన్స్ కు ఊపొచ్చే విషయమే.

షిప్ లో చిత్రీకరించబడిన ఈ సినిమా క్లైమాక్స్ అద్భుతం అన్న విషయాన్ని స్వయంగా ప్రభాస్ కూడా ప్రస్తావించగా, మొదటి ట్రైలర్ లో ఈ షిప్ షాట్స్ హైలైట్ గా నిలిచాయి. హాలీవుడ్ స్థాయిలో గ్రాఫిక్ వర్క్ జరిగిందన్న అనుభూతిని ప్రేక్షకులకు పంచారు. మరి కొత్త ట్రైలర్ లో ప్రేక్షకులను మైమరిపించడానికి ఎలాంటి షాట్స్ ను దర్శకుడు రాధాకృష్ణ కట్ చేసారో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.