Radhe Shyamయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ షూటింగ్ సెప్టెంబర్ రెండో వారం నుండి మొదలు కాబోతుందని మొన్న ఆ మధ్య దర్శకుడు రాధాకృష్ణ ప్రకటించారు. కరోనా తరువాత షూటింగ్ ప్రారంభవుతుందని ప్రకటించిన మొదటి స్టార్ సినిమా ఇదే కావడం విశేషం. అయితే ఇప్పుడు షూటింగ్ వాయిదా పడిందంటూ వార్తలు వస్తున్నాయి.

తాజాగా రాధే శ్యామ్ తదుపరి చిత్రం అక్టోబర్ 20 నుండి రామోజీ ఫిలిం షూటింగ్ లో ప్రారంభం అవుతుందని సమాచారం. ఇది ఇలా ఉండగా అదే నెల 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా చిత్రం కొత్త పోస్టర్ మరియు ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేసే అవకాశం కూడా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాలను అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

ఈ వాయిదా కు కారణం ఏంటో తెలియాల్సి ఉంది. రాధే శ్యామ్ లాక్ డౌన్ కు ముందు దాని షూటింగ్లో 60% పూర్తి చేసింది. చివరిగా జార్జియాలో కీలక షెడ్యూల్ పూర్తి చేశారు. ఇంతకుముందు, దసరా కోసం సినిమాను విడుదల చేయాలనే ఆలోచన ఉంది, కాని ఇప్పుడు సమ్మర్ 2021 వరకు వాయిదా వేయవచ్చు.

రాధే శ్యామ్ తరువాత, ప్రభాస్ మరో రెండు చిత్రాలను సైన్ చేశాడు – నాగ్ అశ్విన్‌తో ఇంకా పేరు పెట్టని చిత్రం మరియు తన్హాజీ ఫేమ్ ఓం రౌత్‌తో ఆదిపురుష్. ఈ రెండు సినిమాలను కూడా 2022లోగా విడుదల చెయ్యాలని ప్రభాస్ వ్యూహంగా ఉంది.