raai-laxmiటీమిండియా సారథి మహేంద్రసింగ్ ధోనీతో డేటింగ్ చేసింది నిజమే, కానీ పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదని హీరోయిన్ రాయ్‌ లక్ష్మి పేర్కొంది. ధోనీ జీవిత కథ ఆధారంగా ‘ఎంఎస్ ధోనీ.. ద అన్‌ టోల్డ్ స్టోరీ’ పేరుతో సినిమా విడుదల కానున్న నేపధ్యంలో… లక్ష్మి రాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ముంబై మీడియాలో ప్రధానంగా హల్చల్ చేస్తున్నాయి. ఒకానొక సమయంలో ధోనీ – రాయ్ లక్ష్మి మధ్య నడిచిన వ్యవహారం ఈ సినిమాలో ఉంటుందా? లేదా? అన్న విషయం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోనీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఆ జట్టుకు లక్ష్మి రాయ్ బ్రాండ్ అంబాసిడర్‌ గా వ్యవహరించింది. సరిగ్గా ఇదే విషయం ఇప్పుడు ఊహాగానాలకు కారణమైంది. ధోనీ మాజీ గర్ల్ ఫ్రెండ్ ప్రియాంక గురించి సినిమా ట్రైలర్‌ లో ప్రస్తావించడంతో రాయ్‌ లక్ష్మి పాత్ర కూడా ఉండే ఉంటుందని చెబుతున్నారు. ఈ ఊహాగానాలపై స్పందించిన రాయ్ లక్ష్మి మాట్లాడుతూ గతాన్ని గుర్తు చేయడం సబబు కాదంటూ పేర్కొంది.

‘మా ఇద్దరి రిలేషన్ వయసు ఒక ఏడాది కంటే తక్కువే. ఇద్దరి అభిప్రాయాలు కలవకపోవడంతో విడిపోయాం. ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు ముగిసిన అధ్యాయం. ఇప్పుడైతే అతడితో టచ్‌లో లేను.’ అని చెప్పడం వరకు బాగానే ఉంది గానీ, ఆ తర్వాత రాయ్ లక్ష్మి చేసిన వ్యాఖ్యలు సంచలనానికి దారి తీసాయి. ‘నాతో విడిపోయిన తర్వాత ధోనీ ఎందరితోనో డేటింగ్ చేశాడు. ఆ జాబితా చాలా పెద్దది’ అంటూ సరికొత్త చర్చకు తెరలేపింది.

అయినా జీవిత కథ అంటే ఒక్క అమ్మాయిలే కాదు… ధోనీ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను చూపిస్తారని అనుకుంటున్నా. ఆ సినిమాలో నా ప్రస్తావన ఉండదనే అనుకుంటున్నా. నా నుంచి ఆ విషయాన్ని తెలుసుకోవాలని చాలామంది ప్రయత్నించారు. ఇక నుంచి ఎవరైనా నన్ను ధోనీ గురించి అడిగితే క్రికెటర్‌ గానే తెలుసు. వ్యక్తిగతంగా పరిచయం లేదు అని చెబుతా… అంటూ కాస్త విసుగ్గానే వివరించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ “జూలీ 2” అనే హాట్ చిత్రంలో నటించింది.