సహజం రాజకీయాల్లో ఒక పార్టీ ఎంత బలహీనంగా ఉన్నా తాము బలంగానే ఉన్నామని ప్రజలు తమ వైపే ఉన్నారని రాజకీయ నాయకులు చెప్పుకోవడం మనం చూస్తూ ఉంటాం. అది సహజం కూడా. అయితే ఏపీ బీజేపీ నేతలు మాత్రం దేశవిరుద్ధం. 80 మంది కాపులు పవన్ కల్యాణ్ వైపే ఉన్నారని, కాపులను పవన్ ఎలా వినియోగించుకుంటారో చూడాలని రాష్ట్ర మాజీ మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు.
రాష్ట్రంలో తాము బలీయమైన శక్తిగా ఎదుగుతామని, వచ్చే ఎన్నికలలో తామే కింగ్ మేకర్లమని చెప్పుకునే బీజేపీ నేతల మాటలకు దీనికీ ఏమైనా సంబంధం ఉందా? రాష్ట్రంలోని ఒక ప్రధాన కులం మద్దత్తు తమకు లేదని ఆయన చెప్పకనే చెప్పారుగా. ఇక ఏ రకంగా బీజేపీ రాష్ట్రంలో ఎదుగుతుందని వారు భావిస్తున్నారో.
బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ కొన్ని బృందాలను కర్ణాటకకు పంపిందని, అయినప్పటికీ కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఆయన అన్నారు. పక్క రాష్ట్రాలలో బీజేపీ గెలుపు గురించి మాట్లాడటం, వాటి గురించి సంబరాలు చేసుకోవడంతోనే సరిపెడుతున్నారు ఆ పార్టీ నేతలు