Pydikondala Manikyala Rao-ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లోని బీజేపీ మంత్రి, మాణిక్యాల రావు తన పార్టీ గుట్టు విప్పారు. ‘‘మేం ఏపీలో వెంట్రుకలాంటి వాళ్లం.. కొండకు వెంట్రుక కట్టి లాగుతున్నాం.. వస్తే కొండ వస్తుంది.. పోతే.. వెంట్రుక పోతుంది.. వాళ్ల (టీడీపీ) కు గుండు అవుతుంది’’, అని రాష్టృ దేవాదాయాశాఖా మంత్రి వ్యాఖ్యానించారు.

అదే మాణిక్యాల రావు నిన్న మరో సంధర్భంలో టీడీపీ పోతే తమతో జత కట్టడానికి మరొకరు రెడీగా ఉన్నారు అని చెప్పుకొచ్చారు. టీడీపీని ఇబ్బంది పెట్టి ఆంధ్రప్రదేశ్ లో బలపడాలి అనుకుంటున్నాం అని ఆయన ఉద్దేశం. అది జరగకపోతే ఎలాగూ ఇక్కడ తమకు ప్రాభల్యం లేదు కాబట్టి పెద్దగా నష్టం లేదని ఆయన ఉద్దేశం.

కాకపోతే మేము కొట్టే దెబ్బకు టీడీపీకి అధికారం పోవచ్చు అనేది ఆయన ఉద్దేశం. ఇదే సంధర్భంగా జగన్ తో కలవడానికి కూడా ఆలోచన చేస్తున్నాం అని ఆయన డైరెక్టుగానే చెప్పేశారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే తన మంత్రి పదవికి సెకనులో రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. ఇప్పుడు అందరి చేతుల్లోనూ స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయని.. ఫోన్‌ ద్వారానే మెయిల్‌ చేయవచ్చని.. రాజీనామాకు సెకను వ్యవధి చాలని చెప్పారు