No buyers for Ismart Shankar movieఎనర్జిటిక్ హీరో రామ్ పూరి జగన్నాధ్ కంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డబల్ సిమ్ కార్డు అనే టాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రంపై రామ్, పూరి జగన్నాధ్ భారీ ఆశలే పెట్టుకున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా పూరి ప్లాపుల మీద ప్లాపులు ఇస్తున్నాడు… రామ్ కెరీర్ కూడా పెద్దగా ఆశాజనకంగా ఏమీ లేదు. ఎప్పుడో ఒక యావేరేజ్ సినిమా తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ హిట్లు ఏమీ లేవు. దీనితో ఈ సినిమాపై వారిద్దరి భవిష్యత్తు ఆధారపడి ఉంది.

అయితే ఇటీవలే విడుదలైన ట్రైలర్ లో పూరి తన పైత్యం మరోసారి చుపించాడంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలో సినిమాను కొనడానికి బయర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇది అలా ఉండగా కాసేపటి క్రితం ఈ సినిమా సెన్సార్ పూర్తి అయ్యింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. సహజంగా ఏ సినిమా టీం కూడా ఏ సర్టిఫికెట్ ను ఆహ్వానించదు. కోరుకోదు. అయితే పూరి టీం మాత్రం పండగ చేసుకుంటుంది. కారణం గతంలో ఉన్న హిట్ సెంటిమెంట్ అట.

గతంలో పూరి కేరీర్ లో బ్లాక్ బస్టరైన పోకిరి, దేశముదురు, బిజినెస్ మాన్ సినిమాలకు కూడా ఏ సర్టిఫికెట్లే రావడంతో అదే సెంటిమెంట్ ప్రకారంతో ఇస్మార్ట్ శంకర్ కూడా పెద్ద హిట్ అవుతుందని పూరి భావిస్తున్నాడు. చూడాలి ఏం అవ్వబోతుందో. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, నభా నటేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు.