Mahesh -Babu-Puri -Jagannadhకొంతకాలం క్రితం మహర్షి ప్రీ-రిలీజ్ ఈవెంట్ స్టేజి మీద మహేష్ బాబు తాను పని చేసిన దర్శకులందరినీ గుర్తు చేసుకున్నాడు. అయితే పూరి జగన్నాధ్, సుకుమార్లను మర్చిపోయాడు. పూరి ఆ విషయంగా హర్ట్ అయినట్టున్నాడు. ఇస్మార్ట్ శంకర్ హిట్ కొట్టిన తరువాత మహేష్ బాబుతో సినిమా గురించి నోరు విప్పాడు పూరి. గతంలో మహేష్ కు పోకిరి, బిజినెస్ మాన్ వంటి హిట్లు ఇచ్చిన పూరి ఆ తరువాత జనగనమన అనే సినిమా అనౌన్స్ చేశాడు. అయితే అది పట్టాలు ఎక్కలేదు.

“నాకు మహేష్ కంటే మహేష్ ఫ్యాన్స్ అంటే చాలా ఇష్టం. వాళ్లకు నేను మహేష్ కు రెండు మంచి సినిమాలు ఇచ్ఛా అని ఎప్పుడూ ఉంటాది. మహేష్ తో జనగణమణ చెయ్యమని రోజు అడుగుతూ ఉంటారు. అయితే వాళ్ళకి తెలియనిది ఏమిటంటే మహేష్ హిట్స్ లో ఉంటేనే నాతో పని చేస్తాడు. ఆయనకంటే ఆయన ఫ్యాన్స్ కు నా మీద నమ్మకం ఎక్కువ,” అని పూరి చెప్పుకొచ్చాడు. ఇస్మార్ట్ శంకర్ హిట్ అయితే చేస్తారేమో కదా అని యాంకర్ అడిగితే “అప్పుడు ఒకే అనడానికి నాకో క్యారెక్టర్ ఉంటుంది కదా,” అని పూరి ఒకింత ఘాటుగానే సమాధానం చెప్పాడు.

మరోవైపు ఇస్మార్ట్ శంకర్ మొదటి రోజు భారీ ఓపెనింగ్ సాధించింది. రెండు రేంజ్ హీరోలలోనే హైయెస్ట్ కలెక్టు చేసింది. ఈ వారాంతానికి బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. దరిదాపులలో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో పెద్ద రేంజ్ అవుతుందని అనుకుంటున్నారు. 2012 తరువాత విడుదలైన బిజినెస్ మాన్ తరువాత పూరికి సరైన హిట్ లేదు. 2011లో వచ్చిన కందిరీగ తరువాత ఒకటి అర యావరేజ్ సినిమాలు తప్ప రామ్ కు పెద్దగా చెప్పుకోదగిన హిట్లు లేవు. దీనితో ఇద్దరూ ఈ మూవీ సక్సెస్ ను పూర్తిగా ఆస్వాదిస్తున్నారు.