మాలీవుడ్ ముద్దుగుమ్మ భావనపై లైంగిక వేధింపులకు ఎవరు పాల్పడమన్నారో అన్న సంగతిని ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన పల్సర్ సునీ ఎట్టకేలకు బయటపెట్టేశాడు. నిన్నమొన్నటి వరకు తనకు ‘మేడమ్’ చెప్పారని చెబుతూ వచ్చిన పల్సర్ సునీని బుధవారం నాడు ఎర్నాకుళం కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద మీడియా పల్సర్ సునీని మేడమ్ ఎవరు? భావనపై లైంగిక దాడి చేయాలని ఆదేశించింది ఎవరు? ఎంత డబ్బులు తీసుకున్నావు? అంటూ పలు ప్రశ్నలు సంధించింది.
దీంతో సమాధానం చెప్పేందుకు ప్రయత్నించిన పల్సర్ సునీ…‘‘నేను దొంగని కదా? ఒక దొంగ చెప్పే విషయాల్ని ఎందుకు వింటున్నారు?’’ అంటూ ఎదురు ప్రశ్నించాడు. తరువాత ‘‘మా మేడమ్ కావ్య. ఈ విషయం ఇదివరకు మీకు చెప్పలేదా?’’ అని అడిగాడు. దీంతో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చినట్టైంది. ఈ దారుణానికి పాల్పడమని పురమాయించింది హీరో దిలీపేనన్న విషయం కూడా దాదాపుగా స్పష్టత వచ్చేసినట్లే. సినీ ఇండస్ట్రీకి చెందిన దిలీప్ – కావ్యా మాధవన్ లు కలిసి ఈ కుట్రకు పాల్పడడం అత్యంత శోచనీయం.
గతంలో తనకు పల్సర్ సునీ ఎవరో తెలియదని కావ్యామాధవన్ వ్యాఖ్యానించిన తరువాత, ఆమె వద్ద పల్సర్ సునీ డ్రైవర్ గా పని చేశాడన్న సమాచారం బయటకు వచ్చింది. ఆ తరువాత పల్సర్ సునీకి 25,000 ఇచ్చానని దిలీప్ చెప్పడన్న సంగతి పోలీసు విచారణలో తేలింది. గతంలో మేడమ్ తనకు డబ్బులిచ్చారని, అయితే అప్పుడు ఆమెకు డబ్బులిస్తోంది… భావనపై దాడి కోసం ఇస్తున్నట్టన్న సంగతి తెలియదని పల్సర్ సునీ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పల్సర్ సునీ చేసిన వ్యాఖ్యలు ఈ కుట్ర కేసులో రహస్యం వెలుగులోకి తెచ్చింది.