దర్శకుడు క్రిష్తో కలిసి పవర్స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం కోసం 17 వ శతాబ్దానికి చెందిన ‘ హైదరాబాద్ కి షాన్’ చార్మినార్ను పోలిన ఒక సెట్ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నారు. నగర శివార్లలో ఈ సెట్ నిర్మాణం వేగంగా జరుగుతుందని సమాచారం. ఈ సెట్ లో ఈ చిత్రం యొక్క భారీ షెడ్యూల్ను ప్లాన్ చేశారు.
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇది మొదటి పీరియడ్ చిత్రం. ఈ చిత్రం డిసెంబర్ లేదా 2022 జనవరిలో విడుదల అవుతుంది. ఈ చిత్రం మొదట ఈ ఏడాది సంక్రాంతి కోసం అనుకున్నారు. అయితే కోవిద్ కారణంగా వాయిదా పడింది. అంటే ముందు అనుకున్న ప్లాన్ కంటే ఒక ఏడాది ఆలస్యంగా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
పవన్ మొట్టమొదటి పీరియడ్ చిత్రం అయిన ఈ చిత్రానికి విరుపాక్ష, వీరమల్లు, హర్ హర్ మహాదేవ్ వంటి టైటిల్స్ వింటున్నాం. ఎంఎం కీరవణి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు. ఆయన పవన్ కళ్యాణ్తో కలిసి పనిచెయ్యడం ఇదే మొదటిసారి. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అనసూయ కీలక పాత్ర పోషిస్తుందని సమాచారం.
ఈ చిత్రంతో సీనియర్ నిర్మాత ఎ.ఎం.రత్నం టాలీవుడ్లోకి తిరిగి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ అయ్యప్పనమ్ కోషియం రీమేక్, ఈ చిత్రాన్ని ఒకే సారి షూట్ చేస్తున్నారు. మొఘల్ సామ్రాజ్యం నాటి కథలో కోహినూర్ వజ్రం దొంగిలించడానికి ప్రయత్నించే దొంగల ముఠా నాయకుడిగా పవన్ ఈ సినిమాలో కనిపిస్తారని టాక్ ఉంది.