'Sarileru-Neekevvaru'-Will-Give-Shankar's-Movie-Experienceప్రముఖ టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకర ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ఆయన నిర్మాణ సంస్థ… ఏకే ఎంటర్టైన్మెంట్స్ తమ ఫస్ట్ ప్రాజెక్ట్ డీటైల్స్ ని ప్రకటించారు. ఫేమస్ రచయిత మధు బాబు రచించిన ‘షాడో’ నవల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ని నిర్మించనున్నారు.

ఇప్పటీకే తెలుగువారికి పరిచయం ఉన్న సూపర్ హీరోని విజువల్ రూపంలోకి తీసుకురానున్నారు. ఈ కథ కోసం రచయిత నుండి అనుమతి పొందాం అని నిర్మాత ప్రకటించారు. అయితే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఎప్పుడు మొదలు అవుతుంది అనే దాని మీద మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

కరోనా కారణంగా ఇండస్ట్రీ లో షూటింగులు ఆగిపోయిన సంగతి తెలిసిందే. అలాగే ఈ వెబ్ సిరీస్ లో సూపర్ హీరో పాత్రలో ఎవరు కనిపిస్తారు అనేది కూడా ఆసక్తికరమే. మన దగ్గరి హీరోలు ఎవరైనా నటిస్తే అది కచ్చితంగా మంచి పాత్ర అవుతుంది. అలాగే ఈ వెబ్ సిరీస్ కి కూడా మంచి హైప్ వస్తుంది.

2020 లో టాలీవుడ్‌లో తొలి హిట్ అయిన మహేష్ బాబు యొక్క సరిలేరు నీకెవ్వరు నిర్మాతలలో అనిల్ సుంకర ఒకరు. ప్రస్తుతం ఆయన అల్లరి నరేష్ నటించిన బంగారు బుల్లోడు అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రొడక్షన్ పూర్తయింది మరియు థియేటర్లు తెరిచిన తర్వాత మేకర్స్ విడుదల చేస్తారు.