Chiranjeevi - Anil Sunkaraఅనిల్ సుంకర ఎకె ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ మంచి ఊపు మీద ఉన్నట్టుగా ఉంది. అతను ఇప్పటికే రెండు క్రేజీ ప్రాజెక్టులను ప్రకటించాడు – శర్వానంద్ తో మహాసముద్రం మరియు సురేందర్ రెడ్డితో అఖిల్ అక్కినేని యొక్క ఇంకా పేరు పెట్టని చిత్రం. మూడవ ప్రకటన దగ్గరలో ఉందని… వర్గాలు చెబుతున్నాయి.

మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి “వేధలం” యొక్క తెలుగు రీమేక్ మూడవ ప్రాజెక్టు. ఈ సినిమా ప్రకటన చెయ్యడానికి అనిల్ చిరంజీవి ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాడు. ప్లాప్ దర్శకుడు కావడంతో మెగా అభిమానులకు ఈ సినిమా మీద బాగా అనుమానాలు ఉన్న విషయం తెలిసిందే.

ఈ మూడు ప్రాజెక్టులు 2021 లో ప్రారంభమవుతాయి మరియు అదే సంవత్సరంలో విడుదల చేయబడతాయి. ఈ వరుస చిత్రాలు కరోనా వైరస్ పాండమిక్ తర్వాత వెంటనే వచ్చే సంవత్సరంలో అనిల్ సుంకరను తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత బిజీ నిర్మాతగా చేస్తాయి. ఇది ఒకరకంగా ఆశ్చర్యకరం అనే చెప్పుకోవాలి.

ఎందుకంటే అనేక మంది నిర్మాతలు సీరియస్ ఫైనాన్సియల్ ప్రాబ్లెమ్స్ లో ఉన్నారు. కరోనా ప్రభావం కారణంగా వారు చాలా స్థిరంగా నిలబడటానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఏడాదిలో టాలీవుడ్ లో వచ్చిన అతికొద్ది హిట్స్ లో సరిలేరు నీకెవ్వరూ ఒకటి. దాని నిర్మాతలలో అనిల్ సుంకర ఒకరు.