కొన్ని రోజుల క్రితమే మా ఎలక్షన్స్ ఎన్నడూ లేని విధంగా గందరగోళంగా జరిగిన విషయం తెలిసిందే. ఎలక్షన్స్ కి ముందు గట్టిగా ఒకరిని ఒకరు తిట్టుకున్న మంచు విష్ణు , ప్రకాష్ రాజ్ లు ఎలక్షన్స్ రోజు నాడు కలిసి మాట్లాడుకోవడం , కౌగిలించుకోవడంతో కథ సుఖాంతం అయిందనుకున్నరంతా. ఇక ఎన్నికల్లో విష్ణు అధిక మెజారిటీ ఓట్లతో మా అధ్యక్షుడిగా గెలవడం తర్వాత ప్రకాష్ రాజ్ కంగ్రాట్స్ చెప్పడం కూడా జరిగింది. అక్కడి వరకూ అంతా బాగానే ఉంది. కానీ తర్వాత ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి గెలిచిన అందరూ ఒకేసారి రాజీనామా చేస్తున్నాం అంటూ ప్రెస్ మీట్ పెట్టడం, తర్వాత అనుకోని విధంగా ఎన్నికలు సక్రమంగా జరగలేదని లోలోపల ఏదో జరిగిందనే వాదన తీసుకొచ్చారు.
ఎన్నికల్లో కొన్ని అక్రమాలు జరిగాయని ఎన్నికల అధికారికి కంప్లైంట్ ఇచ్చి దాని మీద పోరాటం కూడా మొదలు పెట్టాడు ప్రకాష్ రాజ్. ఇప్పుడు మరో ట్విస్ట్ ఏంటంటే ? మా ఎన్నికల్లో కొత్త రగడ మొదలైంది. మా ఎన్నికల్లో YSRCP కి చెందిన ఓ రౌడీ పాల్గొన్నాడని చెప్తూ ట్విట్టర్ లో జగన్ తో కలిసి ఉన్న ఆ వ్యక్తి ఫోటో పెట్టాడు ప్రకాష్ రాజ్. అలాగే ఆ వ్యక్తి మోహన్ బాబు , విష్ణులతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు ప్రకాష్ రాజ్. కాకపోతే అందులో ఎవరి పేర్లు తీయకుండా జస్ట్ ఫోటోలను మాత్రమే పోస్ట్ చేసి ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ ని అర్జెంట్ గా CCటీవీ ఫుటేజ్ ఇవ్వాలని కోరాడు. అలాగే ఇది జస్ట్ బిగినింగ్ అంటూ మా ఎన్నికల్లో అసలేం జరిగింది తమకి తెలియలంటూ ఘాటుగా స్పందించాడు.
ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో మోహన్ బాబు కుటుంబానికి బంధుత్వం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో ఆ పార్టీ కండువా కప్పుకొని ప్రచారం కూడా చేశాడు మోహన్ బాబు. మరి మా ఎన్నికల్లో పొలిటికల్ కి సంబంధించి వ్యక్తి ఎందుకు దూరాడు ? అతనికి ఈ ఎన్నికలకు సంబంధం ఏమిటి ? అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ మేటర్ ఎంత వరకూ వెళ్తుందో దీనిపై విష్ణు ఎలా స్పందిస్తాడో చూడాలి.
#MaaElections2021 .. dear Election officer Krishna mohan garu .. this is just the beginning.. give us the CC footage.. we will let the world know what happened.. how the elections were conducted #justasking pic.twitter.com/ew8waPyAXN
— Prakash Raj (@prakashraaj) October 22, 2021