యంగ్ రెబెల్స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ‘సాహో’ సినిమా నుంచి రెండో వీడియోను చిత్రబృందం ఈరోజు ఉదయం బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ సందర్భంగా విడుదల చేసింది. శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు. ఇదే ఆమె తొలి తెలుగు సినిమా. ఇందులో శ్రద్ధా కపూర్ గన్ను పట్టుకున్న యాక్షన్ సన్నివేశాలను హైలైట్ చేశారు. సినిమాలో పోరాట సన్నివేశాలు ఎలా తెరకెక్కిస్తున్నారో చూపించారు. భారీ స్థాయిలో అత్యుత్తమ సాంకేతిక విలువలతో ఈ సినిమా తీస్తున్నట్టు ఆ వీడియో ద్వారా తేటతెల్లం అవుతుంది.
వీడియోలో చూపించిన విజువల్స్ బట్టి సినిమాలో ఫైట్లు ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఉంటాయని తెలుస్తుంది. అయితే సహజంగా ఇలా భారీ సినిమాలు తీసేటప్పుడు, డైరెక్టరు గతి తప్పే అవకాశం ఎక్కువ ఉంటుంది. అసలు కథ మీద కంటే స్టయిల్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టి మొదటికే మోసం తెస్తారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సుజిత్ ఏం చేశారో చూడాలి. బాలీవుడ్ నటులు జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, ఎవ్లిన్ శర్మ, నీల్ నితిన్ ముఖేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ భారీ బడ్జెట్తో సినిమాను తెరకెక్కిస్తోంది. దాదాపుగా 300 కోట్లు ఖర్చు పెడుతున్నారని సమాచారం. ఈ ఏడాది ఆగష్టు 15న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ, మలయాళం బాషలలో సినిమా విడుదల చెయ్యబోతున్నారు. బాహుబలి సక్సెస్ విడుదల కాబోతున్న ప్రభాస్ సినిమా ఇదే కాబట్టి ఈ సాహో మీద భారీ అంచనాలే ఉన్నాయి అన్ని వర్గాల ప్రేక్షకులలోనూ. ఈ సినిమా గనుక పెద్ద హిట్ అయితే ప్రభాస్ ఇంకా వెనక్కు తిరిగి చూసుకోనక్కర్లేదు.