Prabhas-Saahoబాహుబలి సినిమా తరవాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహూ. ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్ యుట్యుబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దానితో బిజినెస్ కూడా మంచి జోరుగా జరుగుతుంది. ఈ నెల 18(ఆదివారం)న రామోజీ ఫిల్మ్ సిటీలో ‘సాహో’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరపబోతున్నారు. దీని కోసం చిత్ర నిర్మాతలు ఏకంగా రెండున్నర కోట్లు ఖర్చు పెడుతున్నారని వార్తలు వస్తున్నాయి.

ఈ ఈవెంట్ స్టేజిని భారీ ఎత్తున సినిమాలోని ఒక పెద్ద సెట్ ను పోలి ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే దీని పని పూర్తయినట్టు సమాచారం. అలాగే చిత్రంలో వాడిన బైకులు, కార్లు, గాడ్జెట్స్, గన్స్, వంటి వాటిని కూడా అక్కడ ప్రదర్శనకు పెట్టబోతున్నారట. ఈవెంట్ వరకే కాకుండా ఆ తరువాత కూడా కొన్ని రోజులు వీటిన్నటినీ అభిమానులు ఆడియన్స్ సందర్శనార్ధంగా పెడతారని సమాచారం. చాలా మంది ఇండస్ట్రీ పెద్దలు ఈ ఈవెంట్ కు రాబోతున్నట్టు తెలుస్తుంది.

గతంలో బాహుబలి 2 ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరిపారు. సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే ఇది కూడా బాహుబలి 2గా భారీ హిట్ అయ్యి ప్రభాస్ ను జాతీయ స్థాయి హీరోగా నిలబెడుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా బాలీవుడ్ లో ప్రభాస్ రేంజ్ పెంచడానికి నిర్మాతలు భారీగా ప్లాన్స్ వేస్తున్నారు. ఇందులో భాగంగా సినిమాకు ఒక్కరోజు ముందు దుబాయ్ లో భారీ ప్రీమియర్ ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ తో సహా దేశంలోని అన్ని ఇండస్ట్రీల ప్రముఖులను ఈ ప్రీమియర్ కు ఆహ్వానించబోతున్నారు. అలాగే ఆయా భాషల్లోని మీడియాను కూడా స్పెషల్ గా ఆహ్వానిస్తున్నారు.