Saaho-Trailer-Talkయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సాహూ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ చిత్ర యూనిట్ కాసేపటి క్రితం విడుదల చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో ఈ ట్రైలర్ ను ప్రదర్శించారు. సినిమాలో రెండు వేల కోట్ల రాబరీలో నిందితుడిని పట్టుకోలేక ముంబై పోలీసు ఒక అండర్ కవర్ కాప్ ప్రభాస్ ని రంగంలోకి దించుతారు. ఆమెకు తోడుగా క్రైమ్ బ్రాంచ్ కు చెందిన అమృతా నాయర్ (శ్రద్ధా కపూర్) ఉంటుంది. 2000 కోట్ల రాబరీ నుండి కథ ప్రపంచంలోనే పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్స్ ఉండే వాజీ సిటీకు మారుతుంది.

వారంతా అనంతమైన సంపద ఉండే ఒక లాకర్ ని ఓపెన్ చేసే కీ కోసం వెతుకుతూ ఉంటారు. వారి వెంట మన హీరో పడతాడని మొత్తం సినిమా స్టోరీని ట్రైలర్ లోనే చెప్పేసింది టీం. హాలీవుడ్ సినిమాని తలపించే స్థాయిలో ఉన్నాయి విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయి. ప్రభాస్ స్టైల్ ఇరగదీశాడు. శ్రద్ధా కపూర్ ని కూడా మంచి విషయం ఉన్న పాత్ర దొరికినట్టే ఉంది. సినిమాకు ఆడియన్స్ ను కట్టిపడేసే కథ, కథనం ఉంటే మాత్రం ప్రభాస్ జాతీయ స్థాయిలో స్టార్ అయిపోయినట్టే. గతంలో సౌత్ నుండి రోబో, 2.0, నార్త్ లో అయితే ఎప్పుడో వచ్చిన ధూమ్, క్రిష్ సినిమాల తరువాత ఈ స్థాయి యాక్షన్ సినిమా రాలేదు. వాటి అన్నిటికంటే సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా ఉంది సినిమా.

సాహూ ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. బాహుబలి తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న సినిమా కావడంతో ‘సాహో’పై దేశవ్యాప్తంగా ట్రేడ్, ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపుగా 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ భారీ చిత్రం కోసం భారీ ఎత్తున ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఇందులో భాగంగా దేశంలోని నాలుగు ప్రధాన నగరాలలో – హైదరాబాద్, ముంబై, బెంగళూరు, కొచ్చి, చెన్నైలో ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు. ఆ నగరాలలో ప్రభాస్ అక్కడి మీడియాతో మాట్లాడతాడు.