prabhasయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహూ సినిమా రిలీజ్ అయ్యి నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. నెగటివ్ టాక్ వచ్చినా ఈ సినిమా భారీ స్థాయిలో వసూలు చేయడం విశేషం. అయితే సినిమా అమ్మిన రేట్లు బట్టి ప్లాప్ గానే మిగిలిపోయింది. దీని తరువాత ప్రభాస్ జాన్ సినిమాపై దృష్టి పెట్టనున్నారు. ఇప్పటికే సినిమా కొంత షూటింగ్ జరిగింది. వచ్చే నెలలోనే షూటింగ్ మొదలు కావాల్సి ఉండగా కొంత టైం తీసుకుని అంతా సరిచూసుకోవాలి టీం కొంత డిలే చేసినట్టు సమాచారం.

1960 కాలం నాటి కథతో సినిమా తెరకెక్కుతోంది. అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. అయితే ఇప్పుడు ఈ సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. పీరియడ్ సినిమా అయినా ఈ చిత్రంలో 5-6 క్యారెక్టర్లు మాత్రమే ఉంటాయట. ఇంత తక్కువ క్యారెక్టర్లతో పీరియడ్ సినిమా రక్తి కట్టించడం అంటే మాములు విషయం కాదు. ఈ సినిమా కోసం పాతిక వరకూ సెట్స్ హైదరాబాద్ లో నిర్మిస్తున్నారట. ఈ సెట్లు అప్పటి యూరోప్ నగరాలను పోలి ఉంటాయట.

మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న పూజా హెగ్డే మొన్న ఆ మధ్య ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో అనేక విషయాలు చెప్పుకొచ్చింది. జాన్ సినిమాలో ప్రభాస్ రోల్ ఎలా ఉండబోతుందో చెప్పి షాక్ ఇచ్చింది. ఇందులో చాలా ఆసక్తికరమైన ట్విస్ట్ లు ఉంటాయని, ప్రభాస్ ను చాలా కొత్తగా కనిపిస్తారని చెప్పింది. సాహూ సినిమా లాగానే జాన్ కూడా రెండో సినిమా డైరెక్టర్ దర్శకత్వం వహించడం గమనార్హం.