prabhas movie shooting stoppedయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం జార్జియాలో షూటింగ్ కు వెళ్ళింది. ఆ సినిమా షూటింగ్ కోసం ఒక మార్కెట్ సెట్ కూడా వేశారు అక్కడ. కరోనా వైరస్ ని కూడా పట్టించుకోకుండా తాము అక్కడ షూట్ చేస్తున్నామని దర్శకుడు రాధాకృష్ణ రెండు మూడు సార్లు ట్విట్టర్ లో అప్డేట్స్ పెట్టాడు.

అయితే ఇప్పుడు అక్కడి షూటింగ్ అర్ధాంతరంగా షూటింగ్ ఆపుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. యూరోప్ లోని కొన్ని దేశాల నుండి వచ్చే యాత్రికుల మీద భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కొన్ని దేశాల నుండి అసలు ఎవరినీ అనుమతించకూడదని, కొన్ని దేశాల నుండి వచ్చిన వారికి కరోనా లక్షణాలు ఉన్నా లేకున్నా 14 రోజుల పాటు ప్రభుత్వ అధీనంలో బాహ్యప్రపంచానికి సంబంధం లేకుండా ఉండాల్సిందే అని తేల్చి చెప్పింది.

దీనితో చేసేది లేక మధ్యలోనే షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తున్నారు. అక్కడ షూట్ చెయ్యాల్సిన భాగాలు ఇక్కడ సెట్స్ వేసి షూట్ చెయ్యాలని భావిస్తున్నారు. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ వచ్చే నెల 25న ఉగాది సందర్భంగా విడుదల చెయ్యబోతున్నారని సమాచారం. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్.

ఈ సినిమాకు ఓ డియర్, రాధే శ్యామ్ అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. అక్టోబర్ లో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటికే విజయదశమికి కేజీఎఫ్ 2 కి విడుదల కానుండడంతో ఏం చెయ్యబోతున్నారు అనేది చూడాలి. ప్రభాస్ సాహో చిత్రం ఫెయిల్ కావడంతో బాహుబలి తో ఎంతో కష్టపడి సంపాదించుకున్న మార్కెట్ నిలుపుకోవాలంటే ఈ సినిమా హిట్ కొట్టి తీరాలి.