Prabhas has started three moviesతెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో షూటింగుల సందడి మొదలు అవుతుంది. దాదాపుగా చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలు సెట్స్ మీదకు వెళ్లిపోయాయి. ఇంకా స్టార్లు కదలాల్సిన టైమ్ కూడా వచ్చేసింది. ఈ నెలలోనే వారు కూడా షూటింగులు మొదలుపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది.

అందరికంటే మహేష్ బాబు చివరిగా షూటింగ్ మొదలుపెట్టవచ్చు. ఒకపక్క కొందరు స్టార్లు తమ సినిమాలు ఆచితూచి మొదలు పెడుతుంటే.. ప్రభాస్ ఏకంగా రెండు సినిమాలు పట్టాలెక్కించాడు. ప్రభాస్ తన రాధే శ్యామ్ షూటింగ్ ను హైదరాబాద్ లో పూర్తి చెయ్యడంలో బిజీగా ఉండగా, అతని మరో ప్రాజెక్ట్, ఆదిపురుష్ ముంబైలో కొత్త షెడ్యూల్ను ప్రారంభించింది.

ఆ రకంగా కరోనా సెకండ్ వేవ్ తరువాత రెండు సినిమాల షూటింగ్ మొదలుపెట్టిన తొలి స్టార్ హీరో గా ప్రభాస్ నిలిచాడు. కానీ ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ పాల్గొనరు. రాధే శ్యామ్ పూర్తి కాగానే ఈ నెలలోనే తన మూడవ చిత్రం… సలార్ షూటింగ్ మొదలుపెడతాడు ప్రభాస్. ఈ నెలాఖరుకు కరోనా సెకండ్ వేవ్ తరువాత ప్రభాస్ మూడు సినిమాల షూటింగ్ మొదలు అయినట్టు అవుతుంది.

సెప్టెంబర్ వరకు ఏకధాటిగా షూట్ చేసి అప్పుడు ఆదిపురుష్ షూటింగ్ కు వెళ్తాడట. రాధే శ్యామ్ దేశవ్యాప్తంగా థియేటర్లు పూర్తిగా తెరుసుకున్న తరువాత విడుదల చేస్తారు. ఇక సలార్ వచ్చే ఏడాది ఏప్రిల్ 14న వేసవి సందర్భంగా విడుదల అవుతుందని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. అలాగే ఆదిపురుష్ 11 ఆగస్టు 2022 న విడుదల కోసం ప్రకటించబడింది.