Prabhas_Rajamouliతమిళ చిత్రం పొన్నియిన్ సెల్వన్ రెండు రోజుల క్రితం రిలీజ్ అయ్యి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యింది. తెలుగు ప్రేక్షకులు పొన్నియిన్ సెల్వన్ ని బాహుబలి తో పోల్చడానికి కూడా సరిపోదని, మణిరత్నం తీసిన సినిమాల్లో అన్నింటికంటే మెల్లిగా సాగే సినిమా అని విమర్శించారు. ప్రభాస్ ఫాన్స్ అయితే బాహుబలి రికార్డుని కొట్టే సినిమా ఇప్పట్లో రాదని తేల్చేశారు.

అయితే కొన్ని గంటల క్రితం రిలీజ్ అయిన ప్రభాస్ ‘ఆదిపురుష్’ టీజర్ తమిళ ప్రేక్షకులకు, తమ సినిమా పొన్నియిన్ సెల్వన్ ని విమర్శించిన తెలుగు వాళ్ళ మీద కసి తీర్చుకునే అవకాశాన్ని కల్పించింది. ఓం రౌత్ తీసిన ఆదిపురుష్ టీజర్ చూసిన తమిళ తంబీలు ఇది కార్టూన్ సినిమా అని, చుట్టి టి.వి. లో కార్టూన్ గా వేసుకోవాలని కామెడీ పోస్ట్లు పెడుతున్నారు. ఈ సినిమా తరువాత నిర్మాతలు నెత్తిమీద తడిగుడ్డ వేసుకోవాలని, ఆస్తులు అమ్ముకోవాలని కామెంట్లు పెడుతున్నారు.

కొంతమంది తమిళ ఫాన్స్ ప్రభాస్ ఎన్ని ప్లాపులు ఇస్తున్నా..ఆగకుండా బాంబుల్లాంటి సినిమాలు ప్రేక్షకుల మీద వేయడం మానుకోవాలని సాహో, రాధేశ్యామ్ తరువాత ఈ ఆదిపురుష్ కూడా మరో బాంబు అవుతుందని పోస్ట్లు పెట్టి, ప్రభాస్ అభిమానులను ఇబ్బంది పెడుతున్నారు. ఆదిపురుష్ టీజర్ చూసిన ప్రభాస్ ఫాన్స్ అడ్డంగా దొరికిపోయాం రోయ్! అని బాధపడుతున్నారు.

బాహుబలి తర్వాత ప్రభాస్ తీస్తున్న సినిమాలు చూస్తుంటే, ఫాన్స్ మాత్రం రాజమౌళి కి రుణపడి ఉండాలి అనిపించడం ఖాయం!