యంగ్ రెబల్స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న ‘సాహో’లోని తొలి పాట ‘సైకో సయ్యా’ పూర్తి వీడియో ఈరోజు ఉదయం విడుదల అయ్యింది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తనిష్క్ బాగ్చి స్వరపరిచిన ఈ పాట బీట్ బావుంది అయితే లిరిక్స్ మాత్రం పూర్తిగా నిరాశపరిచాయి. కారణం ఈ పాటకు మొదట హిందీ లిరిక్స్ రాసి దానికి ట్యూన్ కట్టారు. ఆ తరువాత తెలుగు రైటర్ శ్రీజో ఆ ట్యూన్ కి లిరిక్స్ రాశారు. సహజంగా పరభాషా చిత్రాలు తెలుగులోకి అనువదించినప్పుడు అటువంటివి చేస్తారు.
అయితే ట్యూన్ కి తగ్గ లిరిక్స్ రాయడం శ్రీజో వల్ల కాలేదు. దానితో తెలుగు పాట అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే అసలు విషయం ఏమిటంటే ఆగష్టు 15న విడుదల చెయ్యడానికి టైం బొటాబొటీ కావడంతో హిందీలో షూట్ చేసిన పాట తెలుగులో షూట్ చెయ్యలేదట. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ ఖంగుతిన్నారు. టైం అంత టైం టైట్ అన్నప్పుడు ముందు తెలుగులో పాటలు షూట్ చెయ్యాలి కదా అని వారి అనుమానం. ఈ ఇబ్బంది ఒక్క పాటకేనా లేక ఇంకా ఏమైనా ఉన్నాయా?
ఆగష్టు 15న విడుదల కోసం సినిమా చుట్టేశారు అని వారి ఆందోళన చెందుతున్నారు. అలా జరిగి ఉంటే మాత్రం కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్టు అని వారు వాపోతున్నారు. 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతుంది. రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో ‘సాహో’పై దేశవ్యాప్తంగా ట్రేడ్, ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.