Prabhas - Ashwini Dutt- Nag Ashwinబాహుబలి తో పాన్ – ఇండియా ఇమేజ్ సంపాదించుకున్నాడు ప్రభాస్. బాహుబలి దగ్గర నుండి అన్ని సినిమాలు టైం తీసుకుని, పలు భాషల ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని తీస్తున్నాడు ప్రభాస్. దానితో మిర్చి తరువాత అన్ని సినిమాలు 2-3 ఏళ్ళు పడుతున్నాయి. 2013లో విడుదలైన మిర్చి తరువాత ప్రభాస్ చేసింది కేవలం మూడు సినిమాలు.

నాలుగో సినిమా ఇంకా విడుదలకు చాలా టైం ఉంది. ఇప్పుడు ప్రభాస్ తరువాతి సినిమా నిర్మిస్తున్న అశ్వినీ దత్ … తమ సినిమా ఈ ఏడాది అక్టోబర్ లో ముహూర్తం జరుపుతుందని… ఏప్రిల్ 2022లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కరోనా కారణంగా మరింత ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంది.

పాన్ – ఇండియా ఇమేజ్ ఏమో కానీ వెయిటింగ్ లోనే కాలం గడిచిపోతుంది అంటూ ప్రభాస్ అభిమానులు నిటూరుస్తున్నారు. అంత వెయిట్ చేసి బాహుబలి లాంటి సినిమాలు పడితే పర్వాలేదు. అయితే సాహో లాంటి ప్లాపులు వస్తేనే ఇబ్బంది. మరి మహానటి వంటి పెద్ద హిట్ ఇచ్చిన నాగ్ అశ్విన్ ఏం చేస్తాడో చూడాలి.

బజ్ ఏమిటంటే ఇది కొంచెం ఫాంటసీ తో కూడిన సైన్స్ ఫిక్షన్ చిత్రం. ఈ చిత్రం కోసం చాలా మంది బాలీవుడ్ హీరోయిన్ల పేర్లను వింటున్నాము, కాని ఇంకా ఏమీ ధృవీకరించబడలేదని వర్గాలు చెబుతున్నాయి. నాగ్ అశ్విన్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు, ఇతర ప్రీ-ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నాడు.