యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన మొట్ట మొదటి స్ట్రెయిట్ హిందీ చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నాడు. అతను తన్హాజీ ఫేమ్ ఓం రౌత్తో కలిసి ఆదిపురుష్ అనే పీరియడ్ చిత్రం కోసం జతకడుతున్నాడు. అతను రాధే శ్యామ్ మరియు నాగ్ అశ్విన్ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్తుంది. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు వచ్చింది.
వారు ఈ చిత్రం యొక్క ప్రీ-లుక్ పోస్టర్ను కూడా విడుదల చేశారు మరియు ఇందులో రాముడు, హనుమంతుడు మరియు రావణాసురుడని పోలిన చిత్రాలు ఉన్నాయి. అయితే, రామాయణం ఆధారంగా సినిమా తీసినట్లు మేకర్స్ ప్రకటించలేదు. ప్రభాస్ తరువాతి సినిమా దర్శకత్వం వహిస్తున్న నాగ్ అశ్విన్ మాత్రం ప్రభాస్ రాముడిగా నటిస్తాడని ప్రకటించేశాడు.
దీనితో రాముడి పాత్రకు ప్రభాస్ నప్పుతాడా అని చర్చ మొదలయ్యింది. అయితే రామాయణంలోని ఏ భాగంగా సినిమా తీస్తారు అనేది చూడాలి. క్షత్రియ వీరుడు రాముడిగా అయితే ప్రభాస్ బానే నప్పుతాడు. అయితే అడవుల్లోకి వెళ్లే సాత్విక రాముడి పాత్రలో అనుమానమే. చూడాలి ఎలా ఉండబోతుంది అనేది.
ఈ చిత్రాన్ని 2022 లో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ విలన్గా నటించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరోవైపు, కరోనా కేసులు కాస్త తగ్గుతే తన రాధే శ్యామ్ షూటింగ్ను తిరిగి ప్రారంభించవచ్చని ప్రభాస్ ఎదురు చూస్తున్నాడు.
Celebrating the victory of good over evil! #Adipurush#Prabhas @ItsBhushanKumar @vfxwaala @rajeshnair06 @TSeries @retrophiles1 #TSeries pic.twitter.com/zx5NXseX0G
— Om Raut (@omraut) August 18, 2020