పవర్స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం అప్పట్లో ఒకడుండేవాడు ఫేమ్ సాగర్ చంద్రతో జతకట్టనున్నారు. సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని తన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై బ్యాంక్రోలింగ్ చేయనున్నారు. ఇది మలయాళ బ్లాక్ బస్టర్, అయ్యప్పనమ్ కోషియం యొక్క అధికారిక రీమేక్ అయితే మేకర్స్ దీనిని ప్రకటించలేదు.
ప్రధ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో రానా దగ్గుబాటి కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఆ విషయాన్ని కూడా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కనీసం మల్టీస్టారర్ అన్నట్టుగా కూడా హింట్ ఇవ్వలేదు. ఏదో పవన్ కళ్యాణ్ సోలో ఫిలిం లాగా ప్రకటించేశారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చనున్నారు.
అతను ఇప్పటికే పవన్ కళ్యాణ్ యొక్క వకీల్ సాబ్ కోసం సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ చిత్రంలో పవర్స్టార్ మరోసారి ఖాకీలో కనిపించనున్నారు. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రం రాజీపడని ఇద్దరు అహంభావం గల వ్యక్తుల జీవితాల నేపథ్యంలో తెరకెక్కింది.
తమిళంలో హిందీలో కూడా ఈ సినిమాను రీమేక్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నాడు. తన జెఏ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించబోతున్నాడు. మలయాళంలో సక్సెస్ ఐన ఈ చిత్రం మిగతా భాషలలో ఎలా పెర్ఫర్మ్ చేస్తుందో చూడాలి.