posani krishna muraliసినీ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి ఈ మధ్య కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ లో ఆక్టివ్ గా ఉంటున్నారు. ప్రతి అంశం మీదా చంద్రబాబు మీద విరుచుకుపడుతూ ప్రతిపక్షం నాటి నుండి ఇప్పటివరకూ పోసాని వైఎస్సార్ కాంగ్రెస్ కు మేలు చేస్తున్నారు. తాజాగా ఆయనకు చంద్రబాబుకు ఎందుకు చెడింది అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఆయన.

ప్రజారాజ్యం సమయంలో ఆ పార్టీ తరపున పోటీ చేశారు పోసాని. ఆ సమయంలో చంద్రబాబు రాజకీయ కోణంలో చిరంజీవి ఇంట్లో చిచ్చు రేపారనీ, కుమార్తె ప్రేమ విషయాన్ని అడ్డంపెట్టుకుని చంద్రబాబు, చిరంజీవిపై బురదచల్లారనీ, ఈ క్రమంలో ఓ మహిళా రాజకీయ నాయకురాలైన ఓ మహిళను ఉసిగొల్పారనీ పోసాని ఆరోపించారు.

కనీసం సదరు మహిళా నాయకురాలితో క్షమాపణ కూడా చెప్పించలేదని… దానికి చిరంజీవి ఎంతో బాధపడ్డారని పోసాని చెప్పుకొచ్చారు. అంతా బానే ఉంది ఆ మహిళా నాయకురాలు ఎవరో మాత్రం పోసాని చెప్పలేదు. ఎందుకంటే ఆ మహిళానాయకురాలు రోజా. ఆమె ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరి… ఎమ్మెల్యే అయ్యి కీలక పదవిలో ఉన్నారు.

పైగా వచ్చే మంత్రివర్గ విస్తరణలో ఆమె ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కేబినెట్ లోకి తీసుకుంటారని కూడా వార్తలు వస్తున్నాయి. దానిబట్టి పోసాని ఎంత నిక్కర్చిగా మాట్లాడుతున్నారు అనేది అర్ధం అవుతుందని టీడీపీ అభిమానులు ఆరోపిస్తున్నారు. పోసాని రాజకీయ నాయకుల కంటే ముదిరిపోయారు