Will-Pooja-Hegde-Survive-Kathi-Mahesh-Attackటాలీవుడ్ లో ఇప్పుడు నెంబర్ వన్ హీరోయిన్ పూజా హెగ్డే. స్టార్ హీరోలందరికీ ఈ అమ్మడే కావాలి. నిత్యం సినిమాలతో బిజీగా ఉండే ఈ సుందరికి క్రికెట్ గురించి తెలుసో తెలీదో తెలీదు. అయితే ఇప్పుడు వరల్డ్ కప్ సీజన్ ఎక్కడ చూసినా క్రికెట్ గురించే డిస్కషన్. సోషల్ మీడియాలో కూడా అదే డిస్కషన్. దీనితో అమ్మడు కూడా ఈరోజు జరిగిన ఇండియా న్యూజిలాండ్ సెమీఫైనల్ గురించి తన ఒపీనియన్ తాను చెప్పింది. అయితే అదే ఆమెకు తలపోటు అయిపోయింది.

“టీం ఇండియా ఓడిపోవడం బాధాకరమే. అయితే ధోని ఎందుకు నా ఫేవరెట్ అనేది ఈ గేమ్ తో తేలిపోయింది. ఈ గేమ్ కోసం చెయ్యాల్సింది అంతా చేశాడు. చివరివరకూ ప్రయత్నం చేశాడు. మాజీ కెప్టెన్ కు నా రెస్పెక్ట్ అండ్ లవ్,” అంటూ ట్వీట్ చేసింది పూజా. అయితే మ్యాచ్ లో జరిగింది వేరు. అవ్వడానికి ధోని హాఫ్ సెంచరీ చేసినా ఓడిపోవడానికి ఒకానొక కారణం అతనే. తాను ఆడిన 72 బంతులతో 37 డాట్ బాల్స్ ఆడి బాగా ఆడుతున్న పాండ్యా, జడేజా మీద ప్రెషర్ పెంచాడు.

అది కవర్ చెయ్యడానికి వారు దూకుడుగా ఆడి అవుట్ అయిపోయారు. కనీసం ఒక బాల్ కి ఒక రన్ అన్నట్టు ధోని ఆడినా మ్యాచ్ సులభంగా గెలిచే వాళ్ళం అని వారు ధోని మీద ఉన్న కోపమంతా పూజా హెగ్డే మీద చూపిస్తున్నారు. బహుశగా తనకు పూర్తిగా తెలియని ఫాలో అవ్వని ఆట గురించి పూజా హెగ్డే మాట్లాడకుండానే ఉంటే బావుండేదేం. ఎరక్కపోయి ట్వీటి ఇరుక్కుపోయింది ఈ అమ్మడు. అయితే క్రికెట్ అభిమానుల వ్యవహారం కూడా ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్టు ఉంది.