Pooja Hegde on her moviesస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో సినిమాలో రెండో సారి జతకట్టింది పూజా హెగ్డే. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ సినిమాకు అనూహ్యమైన పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో కలెక్షన్స్ భారీగా ఉన్నాయి. బన్నీ కేరీర్ లోనే మొట్టమొదటి 100 కోట్ల షేర్ సినిమా అవుతుందని ట్రేడ్ కాన్ఫిడెంట్ గా చెబుతుంది.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమెని ఒకేసారి మూడు సినిమాలు చేస్తుంటే, కష్టమనిపించడం లేదా? అని అడిగారు. దానికి ఆమె ఆసక్తికరమైన సమాధానం చెప్పింది. “నాలుగు సినిమాలు ఒకేసారి చెయ్యగల కెపాసిటీ నాకుంది. ఇప్పుడు తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాను కాబట్టి ఇంకో రెండు సినిమాలు హిందీలో చెయ్యగలను,” అని ఆమె చెప్పుకొచ్చింది.

“ఇండియన్ స్టార్ కావడం నా లక్ష్యం. ఏదో ఒక భాషకే పరిమితం కావాలని నేననుకోవట్లేదు. నన్ను ఎవరు యాక్సెప్ట్ చేస్తే, అక్కడ సినిమాలు చెయ్యాలనుకుంటున్నా,” అని కాన్ఫిడెంట్ గా చెప్పింది ఈ అమ్మడు. పూజాకు ప్రస్తుతం తెలుగులో ఒకే ఒక్క సినిమా ఉంది. ప్రభాస్ సరనస జిల్ రాధాకృష్ణ డైరెక్షన్ లో ఆమె నటిష్తుంది.

బాలీవుడ్ లో హ్రితిక్ రోషన్ తో ఇంకో సినిమాకు ఇప్పటికే కమిట్ అయినట్టు చెప్పుకొచ్చింది ఈ భామ. ఇది ఇలా ఉండగా పూజాతో కలిసి నటించడం తనకు చాలా కంఫర్ట్ అని… రెండు కాదు మూడవ సారి కూడా ఆమెతో నటించడానికి తాను రెడీ అని అల్లు అర్జున్ ఇంకో ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.