Pooja-Hegde-Took-Indirect-Dig-at-Rakulపూజా హెగ్డే టాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్. ఆమె ఇప్పుడు ప్రతి చిత్రానికి 2 కోట్లు వసూలు చేస్తుంది. ఇంతకుముందు హృతిక్ రోషన్ యొక్క 2016లో విడుదలైన మొహెంజోదారోలో నటించిన ఈ నటి బాలీవుడ్ లో మరొక పెద్ద ప్రాజెక్ట్ ని సంపాదించింది. రోహిత్ శెట్టి సిర్కస్ లో రణవీర్ సింగ్ సరసన ఆమె కనిపించనుంది.

ఈ చిత్రం నవంబర్‌లో ప్రారంభమవుతుంది మరియు మొదటి షెడ్యూల్‌లోనే నటి జట్టులో చేరనుంది. పూజా ఇటలీలో రాధే శ్యామ్ కీలక షెడ్యూల్ పూర్తి చేసి హైదరాబాద్ తిరిగి వచ్చింది. ఆ చిత్రం కోసం రెండు వారాల షెడ్యూల్ పూర్తి చేయడానికి మిగిలి ఉంది. దానితో మొత్తం షూటింగ్ పూర్తవుతుంది.

ఈ చిత్రాలతో పాటు, ఈ నటి కి టాలీవుడ్ లో అఖిల్ అక్కినేని యొక్క టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా ఉంది. అది కూడా పూర్తయ్యే దశలో ఉంది. అన్నీ కుదిరితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉంది. మరో వైపు రాధే శ్యామ్ వచ్చే ఏడాది సమ్మర్ కు గానీ విడుదలయ్యే అవకాశం లేదు.

ఈ రెండు సినిమాలూ కాకుండా పూజా టాలీవుడ్ లో మరో ప్రాజెక్ట్ ని ఇప్పటివరకు సైన్ చెయ్యలేదు. రణ్‌వీర్, జాక్వెలిన్, వరుణ్ షామా, పూజా హెగ్డే నటించిన సిర్కస్ పూర్తి స్థాయి కామెడి ఎంటర్టైనర్ అని సమాచారం. ఈ సినిమాతో బాలీవుడ్ లో పాగా వెయ్యాలని నటి భావిస్తోంది. చూడాలి ఏం రాసిపెట్టి ఉందొ!