అల వైకుంఠపురములో సినిమాతో 150 కోట్ల షేర్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది బుట్ట బొమ్మ పూజా హెగ్డే. ఈరోజు తెలుగులో టాప్ హీరోయిన్ ఎవరు అంటే ఎవరైనా టక్కున చెప్పే పేరు పూజా. ఆమె డేట్స్ కోసం స్టార్ హీరోలు సైతం వేచి చూడాల్సిన పరిస్థితి. మరో వైపు గత కొంతకాలంగా బాలీవుడ్ లో కూడా పాగా వెయ్యడానికి ప్రయత్నిస్తుంది ఈ అమ్మడు.

హౌస్ ఫుల్ 4 సక్సెస్ కావడంతో మంచి ఊపు మీద ఉంది ఈ అమ్మడు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్‌ హీరోగా తెరకెక్కనున్న ‘కబీ ఈద్‌ కబీ దివాలీ’లో హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకున్నారు. ఈ విషయాన్ని నదియాడ్‌ వాలా గ్రాండ్‌సన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (ఎన్‌జీఈఎఫ్‌) సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది.

ఈ సినిమాకు ఆమెకు ఏకంగా నాలుగు కోట్లు ఆఫర్ చేశారని సమాచారం. అల వైకుంఠపురములో సినిమాకు పూజాకు రెండు కోట్లు ఇంటికి తీసుకుని వెళ్ళింది. ఆ సినిమా సక్సెస్ తో రెండున్నర కోట్లు అడుగుతుంది. ఇక సల్మాన్ ఖాన్ సినిమా హిట్ అయితే ఎంత డిమాండ్ చేస్తాదో ఈ అమ్మడు.

ఇది ఇలా ఉండగా టాలీవుడ్ లో ఆమె ప్రస్తుతం ప్రభాస్ ఓ డియర్, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమాలలో నటిస్తుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సమ్మర్ లో… ప్రభాస్ సినిమా అక్టోబర్ లో విడుదల అయ్యే అవకాశం ఉంది. కరోనా ఇబ్బంది తొలగకపోతే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ వాయిదా పడే అవకాశం ఉంది.