సెన్సేషనల్ : బాంబు పేల్చిన పయ్యావుల కేశవ్!ఉరవకొండ నియోజకవర్గం శాసన సభ్యుడైన పయ్యావుల కేశవ్ ఏపీ పొలిటికల్ వర్గాల్లో ఓ మినీ అణు బాంబునే పేల్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఢిల్లీ నుండి ఓ ప్రత్యేకమైన అతిధి బృందం విజయవాడ చేరుకోనుందని అన్నారు. మంగళవారం నాడు రాత్రి సమయానికి గానీ, బుధవారం ఉదయానికి ఈ బృందం విజయవాడలో ఉంటారని చెప్పిన పయ్యావుల, ఎందుకు వస్తున్నారో, ఎవరు వస్తున్నారో కూడా తెలిపారు.

ఈ సమాచారాన్ని ధృవీకరించుకున్న తర్వాతే మీడియాను పిలిచానని తెలిపిన టిడిపి ఎమ్మెల్యే… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన అప్పులను రికవరీ చేసుకోవడానికి ఢిల్లీ నుండి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు సంబంధించిన అధికారులు మరియు రూరల్ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ అధికారులు రాబోతున్నట్లుగా తెలిపారు. తనకు వచ్చిన సమాచారం మేరకు చాలా అత్యున్నత స్థాయిలో ఉన్న బృందమే విజయవాడ చేరుకోబోతోందని అన్నారు.

గత రెండు రోజులుగా వీరిని నిలువరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించిందని, అనేక రకమైన ఒత్తిడిలను తీసుకువచ్చారని, కానీ అధికారులు విధి నిర్వహణలో భాగంగా తమ అప్పులను రికవరీ చేసుకోవడానికి వస్తున్నారని స్పష్టం చేసారు. పెద్ద ఎత్తున పేరుకుపోయిన బకాయిలు చెల్లించకపోవడంతో ఏపీకి సంబంధించిన విద్యుత్ సంస్థలు నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ క్రిందకు వచ్చేసాయని, దీనిపై తాము ముందు నుండి హెచ్చరిస్తున్నామని అన్నారు.

ఏపీలో పరిస్థితి చేయి దాటిపోయిందని, ఆర్ధిక వ్యవస్థను కుప్పకూల్చే విధిగా పాలన జరుగుతున్న విషయం తాము ముందు నుండి చెప్తూనే ఉన్నామని మంగళవారం నాడు రాత్రి సమయంలో పయ్యావుల పెట్టిన ఈ ప్రెస్ మీట్ సంచలనంగా మారింది. దీంతో బుధవారం ఉదయం నుండి ప్రాంతీయ మీడియా నుండి జాతీయ మీడియా ఛానెల్స్ కెమెరా కళ్లన్నీ ఏపీ పైన ఉండబోతున్నాయని చెప్పడంలో సందేహం లేదు.