Payakarao Pet tdp MLA Anitha  helps pawan kalyan fanపాయకరావుపేటలో ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుదాఘాతంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ గురువారం పాయకరావుపేట రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు మంగళవారం అర్ధరాత్రి దాటాక పాయకరావుపేట ప్రధాన రహదారి పక్కన భవనంపై ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలోనే 33కేవీ విద్యుత్‌ తీగలకు ఫ్లెక్సీ ఇనుప రాడ్స్‌ తగిలి ఇద్దరు అభిమానులు టి.నాగరాజు, భీమవరపు శివ అక్కడికక్కడే మృతిచెందారు. పవన్ కళ్యాణ్ వచ్చి అభిమానుల కుటుంబాలను పరామర్శించేలోపే కరెంట్ షాక్ తో మృతి చెందిన శివ కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే అనిత పరామర్శించారు.

ఆ కుటుంబానికి చంద్రన్న భీమాను పంపిణీ చేసి వారికి అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియచేసారు. ప్రత్యర్థి పార్టీ మనుషులు అని తెలిసినా వెంటనే వెళ్ళి పరామర్శించిన అనితను అందరు అభినందించారట. చనిపోయిన వేరే అభిమాని నాగరాజు స్వస్థలం తుని.

Pawan Kalyan Letter to died fans