Sye Raa Narasimha Reddyమరి కొంత సేపట్లో మెగాస్టార్ చిరంజీవి సైరా మేకింగ్ వీడియో విడుదల కాబోతుంది. దీనితో ఈ చిత్రం ప్రమోషన్స్ మొదలు కాబోతున్నాయి. ఈ క్రమంలో మరో ఆసక్తికరమైన వార్త హల్ చల్ చేస్తుంది. ఈ సినిమా కోసం ఈ నెల 20న విడుదల చెయ్యడానికి ఒక సరికొత్త టీజర్ రెడీ చేశారట చిత్రబృందం. ఆ టీజర్ చిరంజీవి పుట్టినరోజు (ఆగష్టు 22) సందర్భంగా విడుదల కాబోతుంది. ఆ టీజర్ లో పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. దీనితో అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది.

పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం సినిమాలకు గుడ్ బై చెప్పారు. 2017లో విడుదలైన అజ్ఞ్యాతవాసి సినిమా ఆయన చివరి సినిమా. జనసేన పార్టీ అట్టర్ ప్లాప్ కావడంతో ఆయన తిరిగి సినిమాలలోకి వస్తారని అంతా భావించారు. అయితే ఇప్పటివరకు దాని మీద పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీనితో అభిమానులు ఈ వాయిస్ ఓవర్ వార్తకే సంబరపడిపోతున్నారు. ఇదే గనుక నిజమైతే సినిమాకు మంచి హైప్ వస్తుంది. అలాగే వాయిస్ ఓవర్ సినిమా లోకూడా ఉంటే అది సినిమాకు బాగా ప్లస్ అయినట్టే.

చిరంజీవి కేరీర్ లోనే ప్రతిష్టాత్మక చిత్రంగా రూపొందుతున్న సైరా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల అవుతుంది. బాలీవుడ్ లో కూడా ఈ సినిమా పెద్ద ఎత్తున విడుదల అవుతుంది. అమిత్ తడాని, ఫర్హాన్ అక్తర్ ఈ సినిమా హిందీ రైట్స్ ను చేజిక్కించున్నారు. ఫర్హాన్ అక్తర్ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని మార్కెట్ చెయ్యబోతున్నారు. గతంలో వీరిద్దరూ కేజిఫ్ ను హిందీలో ఇలాగే విడుదల చేశారు. దీనితో సినిమాకు అక్కడ మంచి రిలీజ్ వచ్చే అవకాశం ఉంది.