Pawan-Kalyan-Sri-Reddyమసాజ్ ల కోసం పవన్ కళ్యాణ్ బెంగాలీ అమ్మాయిలను తెప్పించుకుంటారని తీవ్ర ఆరోపణలు చేసిన నటి శృతి, నేడు వాటిని వెనక్కి తీసుకుంది. సోమవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా ప్రెస్ మీట్ లో ముందుగా నటి అపూర్వ మాట్లాడుతూ… ‘పవన్ కళ్యాణ్ తనకు చాలాకాలంగా తెలుసని, అలాంటి వ్యక్తి కాదని, బహుశా ఆమె ఆవేశంలో మాట్లాడిందో ఏమో నాకు తెలియదు గానీ, దీనిపై ఆమె వివరణ ఇచ్చుకుంటుందని’ మైక్ ను శృతికి ఇచ్చింది.

తాను పొరపాటుగా పవన్ కళ్యాణ్ పై మాట్లాడానని, దీనికి పవన్ కళ్యాణ్ అభిమానులు తనను మన్నించాలని కోరింది. ఈ ఉదంతం తర్వాత మైక్ అందుకున్న శ్రీరెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తపరిచింది. నిన్నొక మాట, ఈ రోజొక మాట చెప్పేవాళ్ళు ఇక్కడ ఉండవద్దని, అభిమానం, భయం ఉంటే తన పోరాటంలో నిలవవద్దని నటి శృతి, అపూర్వలపై మండిపడింది. ఇది తాను ప్రారంభించిన ఉద్యమమని, ఎవరైనా నీరుగారిస్తే ఊరుకోనని తెగేసి చెప్పింది.

ఆ తర్వాత ఈ వేదికపై నుండి పవన్ కళ్యాణ్ అభిమానులపై మహిళా లోకం విమర్శల వర్షం కురిపించింది. అభిమానం పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే ఊరుకునేది లేదని, కనీసం అభిమానులను కూడా పవన్ కళ్యాణ్ కంట్రోల్ లో పెట్టుకోలేరా అంటూ ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేసిన నాటి నుండి నటి శృతికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఎప్పుడు ఎవరి పేరు బయటకు వస్తుందోనని అంతా భయపడుతున్నారని విమర్శించారు.

తమకు వ్యక్తిగతంగా ఎవరి మీద కక్ష్య లేదని, ఇది సినీ ఇండస్ట్రీ కోసం, మహిళల హక్కు కోసం జరుగుతున్న పోరాటం అని, ఇందుకు ఏ హీరో గానీ, ఏ హీరో అభిమానులు గానీ అడ్డొచ్చినా సహించేది లేదని, ఒక పెద్ద సినిమా రిలీజ్ అయితే ట్వీట్లు పెట్టే పెద్ద హీరోలంతా ఇంతమంది అమ్మాయిలు రోడ్డు మీదకు వస్తుంటే ఎందుకు కనీసం నోరు కూడా మెదపడం లేదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇది ఇక్కడితో ఆగేది కాదని ఓ స్పష్టమైన ప్రకటన చేసారు.