Sri-Reddy-Worked-in-Sakshi-for-2.5-Yearsతెలుగు సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌కు వ్యతిరేకంగా గళమెత్తి ఏకకాలంలో ప్రశంసలు, విమర్శలుఎదుర్కొంటున్న నటి శ్రీరెడ్డి. పవన్ కళ్యాణ్ ను శ్రీరెడ్డి కించపరిచేలా మాట్లాడారని, శశాంక్ వంశీ అనే ఆయన పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన ఎస్‌ఐ గురునాథ్‌ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అలాగే ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ లో కూడా మరో పిర్యాదు నమోదు అయింది.

మరో నటి మాధవీలత శ్రీరెడ్డికి వ్యతిరేకంగా ఫీల్మ్ ఛాంబర్ ముందు ధర్నాకు కూర్చున్నారు. అన్ని వైపుల నుండి ఒత్తిడి రావడంతో శ్రీరెడ్డి వెనక్కు తగ్గినట్టు కనిపిస్తుంది. ఒక వ్యక్తి ప్రభావంతో తాను పవన్ కళ్యాణ్ పై అనుచితవ్యాఖ్యలు చేశానని దాని వల్ల మొత్తం ఉద్యమం పక్కదారి పట్టిందని ఆమె చెప్పుకొచ్చారు.

“నీ రాజకీయం కోసం నన్ను వాడుకున్నావని నాకు ఆలస్యంగా అర్ధమయ్యింది. దీనివల్ల మా ఉద్యమం చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. అయితే దీనిని నేను ఎంత మాత్రం ఒప్పుకోను. పవన్ కళ్యాణ్ కుటుంబానికి నా క్షమాపణలు.” అని శ్రీరెడ్డి తన అధికారిక ఫేసు బుక్ పేజీలో ప్రకటించింది. దీనితో ఈ వివాదం సద్దుమణుగుతుందేమో చూడాలి