ప్రత్యేకహోదాపై లోక్ సభలో అవిశ్వాస తీర్మానం పెడితే తాను మద్దతు కూడగడుతా అని అప్పట్లో చెప్పిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. బుధవారం వేగంగా పరిణామాలు మారినప్పటి నుండి పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు రావడం కానీ పార్టీ తరపున ప్రకటన చెయ్యడం కానీ చెయ్యలేదు.
గతంలో అవిశ్వాస తీర్మానం పెడితే తాను మద్దతు కూడగడుతా అని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఆ తరువాతి కాలంలో ఎందుకు బీజేపీతో గొడవ ఎందుకులే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఏదో నామమాత్రం విమర్శలు తప్ప ఆయన కేంద్రంపై పెద్దగా మాట్లాడింది లేదు. మొత్తం అస్త్రాలు అన్నీ రాష్ట్ర ప్రభుత్వం మీదే ఎక్కు పెడుతున్నారు
అయితే కీలక తరుణంలో పవన్ కళ్యాణ్ మరింత చేటు చేస్తుంది ఆ పార్టీకి. దీనిని ఆ పార్టీ వారే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటువంటి చిన్న చిన్న తప్పులకు భారీ మూల్యం చెల్లించాల్సి రావొచ్చు అని వారి భయం. చూడాలి పవన్ కళ్యాణ్ ఢిల్లీ బాట పట్టి అవిశ్వాసానికి మద్దతు కూడగడతారో లేదో.