Pawan Kalyan serious on dil rajuపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ళ గ్యాప్ తరువాత సినిమాల్లోకి తిరిగి వచ్చారు. బాలీవుడ్ లో సూపర్ హిట్టయిన పింక్ ని తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అదే రోజు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లుని పెట్టింది. అయినా మంచి రోజు కావడంతో పవన్ ఒక పూట షూటింగ్ చేసి వచ్చాడు.

రాజకీయంగా ఇబ్బంది అని దానిపై అధికారిక ప్రకటన కూడా చేయించలేదు. సైలెంట్ గా డ్రెస్ మార్చి అమరావతిలో దిగిపోయాడు పవన్. అయితే ఆయన షూటింగ్ చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వచ్చేసి పెద్ద దుమారమే లేపాయి. రాష్ట్రంలో ఇంత పెద్ద విషయం జరుగుతుంటే సినిమాను వాయిదా వేసుకోలేవా అంటూ మిగతా పార్టీ వారు పవన్ పై విరుచుకుపడ్డారు.

దీనితో షాకైన పవన్ దిల్ రాజు మీద ఫైర్ అయినట్టు సమాచారం. నేను మరీ మరీ చెప్పినా కూడా కనీస జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా? అంటూ పవన్ విరుచుకుపడ్డారట. ఇక ముందు ఇటువంటివి జరిగితే సహించబోనని తేల్చి చెప్పారట. ఇది ఇలా ఉండగా ఫిబ్రవరి నుండి పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.

ఈ చిత్రాన్ని మేలో వేసవి సందర్భంగా విడుదల చెయ్యాలని చిత్రబృందం భావిస్తుంది. ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ కేవలం 20 రోజులు షూట్ చెయ్యబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా నివేతా థామస్, అంజలి, అనన్య (మల్లేశం ఫేమ్) నటిస్తున్నారు. ప్రస్తుతం వారి మీద కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు.