Pawan Kalyan responds on Rajya Sabha Deputy Spekaer Electionsజనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ రాగం అందుకుంటున్నారా? ఇటీవలే కాలంలో ఆయన కేంద్ర పరిధిలో ఉన్న విషయాలపై మాట్లాడకుండా రాష్ట్ర ప్రభుత్వాన్నే ఎక్కువగా విమర్శిస్తున్నారు. తాజాగా ఆయన రాజ్యసభ ఉపాధ్యక్షుడి ఎన్నికలో తెలుగు దేశం ఎంపీల వ్యవహరించిన తీరు గురించి విమర్శించారు.

కాంగ్రెస్‌ను తిట్టినతిట్టు తిట్టని ఆయన మొన్న రాజ్యసభలో వాళ్ల ఎంపీలతో కాంగ్రెస్‌కు ఓటేయించారన్నారన్నారు పవన్ కళ్యాణ్. అయితే రాష్ట్రపతి ఎన్నికలో టీడీపీ ఏం చెయ్యాలని పవన్ కళ్యాణ్ భావించారు? ఎన్డీయే అభ్యర్ధికి ఓటు వెయ్యాల్సిందని ఆయన భావిస్తున్నారా? లేదా ఎవరికీ ఓటు వెయ్యకుండా ఎన్డీయేకు రావాల్సిన ఓట్లు తగ్గించి వైకాపాలా ఇండైరెక్టుగా మేలు చెయ్యాలని భావిస్తున్నారు.

తాము వేసిన ఓటు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు అని తెలుగు దేశం పార్టీ చెప్పిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు ఏ పార్టీ అభ్యర్థిని నిలబెట్టినా వారికే ఓటు వెయ్యాలని టీడీపీ భావించింది. మరి బీజేపీ వ్యతిరేక ఓటు అంటే పవన్ కళ్యాణ్ కు ఇబ్బంది ఏంటో అని తెలుగు దేశం నేతలు విమర్శిస్తున్నారు.