Dear Pawan Kalyan, It is Not Wise To Repeat The Same Blunder Twice2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేది తమ పార్టీయేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘ప్రజా పోరాట యాత్ర’లో భాగంగా ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నారు. ఎవరికుండే నమ్మకం వారికి ఉంటుంది గానీ, జనసేనదే అధికారం అని చెప్తోన్న పవన్, తమ పార్టీకి ఏ గుర్తు పైన ప్రజలు ఓటు వేయాలో చెప్పడం లేదు. బహుశా తనకున్న క్రేజ్ ఓటు బ్యాంకింగ్ ను తీసుకువస్తుందని భావిస్తున్నారో ఏమో గానీ, ఇప్పటివరకు పార్టీ గుర్తు ప్రస్తావనే తీసుకురాలేదు.

బహుశా ఎవరైనా చెప్పారో లేక తనకే జ్ఞానోదయం అయ్యిందేమో గానీ, తొలిసారిగా జనసేన గుర్తుకు ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన బహిరంగ సభలో… ‘జనసేన’ గుర్తు ‘పిడికిలి’ అంటూ ప్రకటించారు పవన్. సమాజంలో అందరి ఐక్యతకు చిహ్నంగా పిడికిలి ఉంటుందని, అందుకే ఈ గుర్తును ఎంపిక చేసుకున్నట్లుగా ప్రజలకు వివరించారు. అయితే పవన్ ప్రకటించినప్పటికీ, ఈసీ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.