జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండేళ్ళ గ్యాప్ తరువాత తిరిగి సినిమాల్లోకి ఎంటర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆయన తన కమ్ బ్యాక్ ఫిలిం, పింక్ రీమేక్ షూటింగ్ ఇటీవలే మొదలు పెట్టారు. ఈ సినిమాలో ఆయన రోల్ చాలా లిమిటెడ్ గా ఉంటుంది. ఈ నెలాఖరు లోగానే పవన్ కళ్యాణ్ పార్టు కంప్లీట్ అయిపోతుందని అంటున్నారు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు లాయర్ సాబ్ అనే పేరు అనుకుంటున్నారని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రోజు మీడియా తో మాట్లాడిన దిల్ రాజు…. తమ సినిమాకు ఇంతవరకూ పేరు కంఫర్మ్ చెయ్యలేదని, ఉగాదికి పేరు ప్రకటించే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
ఇదే సందర్భంగా మే 15న తమ సినిమా విడుదల అవుతుందని కూడా దిల్ రాజు కంఫర్మ్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా నివేతా థామస్, అంజలి, అనన్య (మల్లేశం ఫేమ్) నటిస్తున్నారు. దీనికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తాడు. ఇంతకీ ఈ పింక్ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే.. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు, ఓ లాయర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది.
ఆ ముగ్గురు అబ్బాయిల్లో ఒకరు ఓ అమ్మాయిపై అత్యాచారం చేయాలని చూస్తాడు. ఆమె తప్పించుకునే క్రమంలో బీర్ బాటిల్తో అతని తల పగలగొడుతుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఈ కేసును మొదటి నుంచి డీల్ చేస్తున్న లాయర్ (అమితాబ్ బచ్చన్) ఎలా నెగ్గారు అన్నదే కథ. పవన్ కళ్యాణ్ వయసు, ఇమేజ్ ని బట్టి కథలో మార్పులు చేర్పులు చేశారట.