official-pawan-kalyan-comeback-with-pink-remakeజనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పింక్ రీమేక్ చెయ్యబోతున్నా అని బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఇప్పటికే ఒక ప్రకటన చేశారు. బాలీవుడ్ లో విజయవంతమైన పింక్ సినిమాను పవన్ తో రీమేక్ చెయ్యబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు, ఓ లాయర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది.

ఆ ముగ్గురు అబ్బాయిల్లో ఒకరు ఓ అమ్మాయిపై అత్యాచారం చేయాలని చూస్తాడు. ఆమె తప్పించుకునే క్రమంలో బీర్ బాటిల్‌తో అతని తల పగలగొడుతుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఈ కేసును మొదటి నుంచి డీల్ చేస్తున్న లాయర్ (అమితాబ్ బచ్చన్) ఎలా నెగ్గారు అన్నదే కథ. తాప్సి పోషించిన ఆ పాత్ర కోసం స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే తో మంతనాలు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి.

పింక్ లో అమితాబ్ బచ్చన్ ఒక వృద్ధ లాయర్ గా కనిపిస్తారు. ఆ పాత్ర పవన్ కళ్యాణ్ చెయ్యబోతున్నారు కాబట్టి ఆయన ఇమేజ్ ఆధారంగా కొన్ని మార్పులు చెయ్యబోతున్నారట. త్రివిక్రమ్ పర్యవేక్షణలో స్క్రిప్ట్ మార్పులు జరుగుతాయని కూడా అంటున్నారు. నానితో ఎం సి ఏ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు.

మరోవైపు పవన్ కళ్యాణ్ క్రిష్ తో మరో సినిమా చెయ్యబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా కూడా వచ్చే సంవత్సరం పట్టాలు ఎక్కుతుందట. ఒకే ఏడాది రెండు సినిమాలు చేస్తే పవన్ కళ్యాణ్ రాజకీయాలకు సరైన సమయం వెచ్చించగలరా అనేది ఇంకో ప్రశ్న.