స్వయం ప్రకటిత మేధావి ఉండవల్లి అరుణ్ కుమార్ కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని, ఎన్డీఏ ప్రభుత్వం కూలగొట్టే అవకాశం మెండుగా ఉందని చెప్పుకొచ్చారు. ఉండవల్లి రాజకీయ మేధావి అని నమ్మిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పల్లవి అందుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తెదేపా, వైకాపాలకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామాలు చేయవచ్చన్నారు.
కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే కేంద్రంపై అవిశ్వాసం పెడితే గవర్నమెంట్ కూలిపోయే అవకాశం అసలు లేదు. నిజమే ప్రభుత్వ వైఫల్యాలు సభలో చర్చించవచ్చు. సభ్యుల సంఖ్య ఆధారంగా మాట్లాడే అవకాశం వస్తుంది. ఈ లెక్కన టీడీపీ, వైకాపాలకు ఏం అవకాశం వస్తుంది?
ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ పై మోడీ మరింత కక్ష సాధిస్తారు. కీలక ప్రాజెక్టులకు అనుమతులు రాకుండా అడ్డుకుంటారు. దీనితో అసలు మొదటికే మోసం వస్తుంది. మరోవైపు మూడు నాలుగు రోజుల్లో జేఎఫ్సీ నివేదిక వస్తుందని.. అనంతరం ప్రణాళికతో ముందుకెళ్తామన్నారు పవన్ కళ్యాణ్.