‘ఆటగదరా శివా’ ఫేం ఉదయ శంకర్ హీరోగా ‘మిస్ మ్యాచ్’ విడుదలకు సిద్ధం అవుతుంది. వచ్చే నెల 6న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఉదయశంకర్ హీరోగా ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కుతా అని ధీమాగా ఉన్నాడు. ఇటు యాక్షన్ సీన్స్ లోనూ అటు రొమాంటిక్ సీన్లతో పాటూ ఎమోషనల్ సీన్స్ లో కూడా ఉదయశంకర్ నటన ఆకట్టుకుంటుందని చిత్రబృందం అంటుంది.
సినిమాను ప్రేక్షకులకు దగ్గర చెయ్యడానికి పవన్ కళ్యాణ్ తొలిప్రేమలోని ‘నీ మనసే’ వంటి క్లాసిక్ పాటని రీమిక్స్ చేశారట. ఈ పాట కోసం మెగా అభిమానులు ఎగబడి థియేటర్లకు వస్తారని చిత్ర నిర్మాతలు అభిప్రాయం. తొందరలో ఈ పాటను విడుదల చెయ్యడానికి సిద్ధం అవుతున్నారట.
డిసెంబర్ మొదటి వారంలో కార్తికేయ నటించిన 90 ఎంఎల్ మరికొన్ని చిన్న సినిమాలతో ఈ సినిమా పోటీ పడనుంది. ఈ సినిమాకి గిప్తాన్ ఎలైస్ సంగీతం అందిస్తున్నారు. ‘అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ పతాకంపై నిర్మితమౌతున్న ఈ ‘మిస్ మ్యాచ్’ సినిమాకి ఎన్.వి.నిర్మల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
విజయ్ అంటోనీ హీరోగా తమిళంలో సలీం వంటి వియవంతమైన సినిమాకి దర్శకత్వం వహించిన నిర్మల్ కుమార్ కి ఇది తొలి తెలుగు సినిమా. జి. వి. జి. రాజు సమర్పణలో శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మాతలుగా తొలి ప్రయత్నం చేస్తున్నారు.