2019లో ఏపీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీ విజయం సాధించబోతోంది? ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రకారం అయితే తెలుగుదేశం పార్టీ…. సాక్షి జ్యోతిష్యం వైసీపీ అని చెప్తుండగా… కొత్తగా వెలుగులోకి వచ్చిన 99ఛానల్ సర్వే జనసేన పార్టీ … ఇలా మీడియా ఛానల్ కో ప్రభుత్వం వస్తుందని నివేదికలు ఇస్తున్నాయి. వీటి వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అందరికీ బహిరంగమే.
ఈ మూడింటిలో రెండు ఏబీఎన్ చెప్పింది జరగడానికి వాస్తవిక పరిస్థితులు అనుకూలంగా ఉండగా, సాక్షి చెప్పింది జరగాలంటే టిడిపి ఉన్నట్లుండి పతనం కావాలి. ఇక 99 ఛానల్ ప్రస్తావించింది జరగాలంటే మరో అద్భుతమే జరగాలి. ఈ ఛానల్ ప్రకారం అయితే జనసేనకు ఏకంగా 130 సీట్లు వస్తాయని ప్రసారం చేసింది. మరి మిగిలిన 45 సీట్లను ఎందుకు డిస్కౌంట్ ఇచ్చారో గానీ, వాటిల్లో కూడా జనసేన వచ్చేస్తుందని చెప్తే బాగుండేదని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.
ఇంకా మిగిలి ఉంది ఒక్క కాంగ్రెస్ పార్టీ సర్వే మాత్రమేనని, వాళ్ళు కూడా జనసేనకు పోటీగా ఓ సర్వేను దింపితే, ప్రజలకు ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ ను పంచిన వారవుతారు. తాను ఈ ప్రపంచంలోనే సచ్చీలుడిని, నిజాయితీ గల వ్యక్తిని అన్నట్లుగా చెప్పుకునే పవన్ కళ్యాణ్ కు ఈ సర్వేలో ఉన్న “నిజాయితీ” కనిపించలేదా? లేక అధికార దాహం ముందు ఇలాంటి సర్వేలు చెల్లుబాటు అవుతాయనుకుని భావిస్తున్నారా?