త్వరలోనే తెలుగుదేశం పార్టీ నుంచి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారాలని భావిస్తున్న హాస్య నటుడు వేణు మాధవ్, ‘జనసేన’ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు తెలిసి పవన్ కల్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రారని అన్న వేణు, 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ మద్దతు ఇవ్వకపోయినా, టీడీపీ గెలుస్తుందని భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చారు.
‘నంద్యాల ఎన్నికల్లో వైఎస్ జగన్ ను, రోజాను తిట్టడానికి ఎంత డబ్బు తీసుకున్నారు?’ అన్న ప్రశ్నకు ఆయన్నుంచి సమాధానం రాబట్టే ప్రయత్నం జరిగింది. ‘బయటకు చెప్పుకోవడానికి సిగ్గుపడే వ్యాధితో మీరు బాధపడుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం. దీనిపై నిజమేంటి?’ అన్న ప్రశ్నకు తాను ఎంత బ్లడ్ కావాలంటే అంత బ్లడ్ ఇస్తా, వారినే చెక్ చేయించుకోమనండని వేణు మాధవ్ చెప్పిన ప్రోమో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.