Pawan Kalyan Insulted CPM Madhuజనసేనతో కలిసి ఎలాగైనా నాలుగు సీట్లు తెచ్చుకోవాలని ఆరాటపడుతున్న వామపక్షనేతలకు ఈరోజు విజయవాడలోని జనసేన కార్యాలయం వద్ద చేదు అనుభవం అయ్యింది. ప్రత్యేక హోదాపై భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించడానికి వారు పవన్ కళ్యాణ్ ని కలవడానికి అక్కడి వచ్చారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతోపాటు మరో ఇద్దరు నాయకులు మధ్యాహ్నం జనసేన కార్యాలయానికి వచ్చారు. కాగా. వీరిని కార్యాలయంలోకి వెళ్ళకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. తమకు సమాచారం లేదని, లోనికి అనుమతించమంటూ నేతలను అడ్డుకున్నారు. దీంతో చేసేదేమీలేక దాదాపు ఓ పావుగంట సేపు అలాగే గేటు బయట వామపక్ష నేతలు నిల్చుండిపోయారు.

వేరే మీటింగులో ఉన్న పవన్ కళ్యాణ్ ఆ తరువాత వారిని పంపమని చెప్పారట. లోపాలకి పంపాల్సిందిగా సెక్యూరిటీకి ఆదేశాలు రావటంతో చివరకు గేట్లు తీశారు. ఆ తర్వాత వామపక్ష నేతలు లోనికి వెళ్లారు. ఈ అవమానంతో వామపక్షనేతలు లోలోపలే రగిలిపోతున్నారట. ఇప్పటికే ఉమ్మడి కార్యాచరణాలలో జనసేన జెండాలు ఎర్ర జెండాలను డామినేట్ చెయ్యడం వారికి నచ్చట్లేదని సమాచారం.