జనసేన అధినేత పవన్కల్యాణ్ ప్రస్తుతం కరీంనగర్ లో ఉన్నారు. అక్కడ ఆయన బసచేసిన హోటల్ వద్దకు పెద్దసంఖ్యలో అభిమానులు తరలివస్తున్నారు. దీంతో ఈ ఉదయం అభిమానుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ కారణంగా హోటల్ అద్దాలు పగిలాయి. సిబ్బందికి గాయాలయ్యాయి.
దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అభిమానుల తాకిడి ఎక్కువ కావడం పవన్కు భద్రత కల్పించాల్సిన వ్యక్తిగత భద్రతా సిబ్బంది తక్కువగా ఉండటంతో పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. స్థానిక పోలీసులు కూడా పెద్దగా భద్రతా ఏర్పాట్లు చేయకపోవడంతో అంతా రసాభాసగా మారింది.
దీనితో చాలా కష్టంగా ఆయన స్థానిక శుభం గార్డెన్స్ కు వెళ్లారు. అక్కడ ఇదివరకటి కరీంనగర్, ఆదిలాబాద్, మరియు నిజామాబాద్ కు చెందిన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సంధర్భంగా తెలంగాణలోని కరీంనగర్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని సాగిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది’ అని పవన్ కల్యాణ్ అన్నారు.