జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండేళ్ళ గ్యాప్ తరువాత తిరిగి సినిమాల్లోకి ఎంటర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆయన తన కమ్ బ్యాక్ ఫిలిం, పింక్ రీమేక్ షూటింగ్ ఇటీవలే మొదలు పెట్టారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మరో సినిమా మూడు రోజుల క్రితం అల్యూమినియం ఫ్యాక్టరీ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించింది.
నిన్న పవన్ కళ్యాణ్ షూటింగ్ కు ఎంటర్ అయ్యాడని సమాచారం. ఈ చిత్రం కోసం రెండు సంవత్సరాలుగా తియ్యని గెడ్డం పవన్ కళ్యాణ్ తీసేసి కొత్త లుక్ లో కనిపించాడు. ఇది ఇలా ఉండగా ఈ షెడ్యూల్ కోసం అల్యూమినియం ఫ్యాక్టరీ లో వాటర్ బ్యాక్ డ్రాప్ లో ఒక సెట్ వేశారట. ఇప్పుడు ఆ సెట్ లో పవన్ కళ్యాణ్ పై కొన్ని కీలకమైన సన్నివేశాలు షూట్ చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దొంగగా కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మొఘలాయిల కాలానికి సంబంధించిన కథ ఇది. మహమ్మదీయుల పరిపాలనా కాలం, అప్పటి పరిస్థితులు… ఇవన్నీ తెరపై చూపించబోతున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఇవన్నీ ఎంతవరకూ నిజమో తెలియాల్సి ఉంది.
పవన్ కళ్యాణ్ ఒక పీరియడ్ సినిమా చెయ్యడం ఇదే మొదటి సారి. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యడం ఆయనకు ఇదే మొదటి సారి. గత ఏడాది ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండు సినిమాలతో రెండు ప్లాపులు ఇచ్చిన క్రిష్ ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టాలని కృతనిశ్చయంతో ఉన్నాడు.