ఈ ఏడాది నితిన్ భీష్మతో హిట్ కొట్టిన సీతార ఎంటర్టైన్మెంట్, మలయాళం బ్లాక్ బస్టర్, అయ్యప్పనమ్ కోషియం యొక్క రీమేక్ హక్కులను దక్కించుకుంది. మొన్న ఆ మధ్య నందమూరి బాలకృష్ణ తాను సినిమా చేయడం లేదని ధృవీకరించారు. తరువాత, రవితేజ చేస్తున్నారని వార్తలు వచ్చినా ప్రస్తుతం ఈ సినిమా గురించి ఇంకో వార్త వినిపిస్తుంది.

“పవన్ కళ్యాణ్ అయ్యప్పనమ్ కోషియం రీమేక్ పట్ల ఆసక్తి చూపించారు. ఈ ప్రాజెక్ట్ గురించి ఇటీవల పవన్‌కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ మధ్య చర్చ జరిగింది. పవన్ ఈ చిత్రాన్ని చూశారు. ఈ సమయంలో అతను చేపట్టడానికి ఇది ఒక సౌకర్యవంతమైన ప్రాజెక్ట్ అని ఆయన భావిస్తున్నారు, “మనకు విశ్వసనీయంగా తెలిసిన సమాచారం.

పవన్ కళ్యాణ్ చేస్తుంటే త్రివిక్రమ్ ఈ ప్రాజెక్టును డైరెక్టు చెయ్యనున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే వకీల్ సాబ్ అనే రీమేక్ ప్రాజెక్ట్ తో తిరిగి వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ రీమేక్లు బానే చేస్తున్నారు. దానితో అభిమానులకు ఈ వార్త అసలు నచ్చలేదు. పైగా అయ్యప్పనమ్ కోషియం సినిమా పవన్ కళ్యాణ్ కు సూట్ కాదని వారి అభిప్రాయం.

థ్రిల్ల‌ర్ మూవీగా తెర‌కెక్కిన అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ చిత్రం రాజీప‌డని ఇద్దరు అహంభావం గ‌ల వ్య‌క్తుల జీవితాల నేప‌థ్యంలో తెర‌కెక్కింది. తమిళంలో హిందీలో కూడా ఈ సినిమాను రీమేక్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నాడు. తన జెఏ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించబోతున్నాడు.